వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల వేళ బీహార్‌లో హైస్పీడ్ రైళ్లు - పూర్తయిన రైల్వే నెట్‌వర్క్‌ ఆధునికీకరణ - గంటకు 130కిమీ

|
Google Oneindia TeluguNews

రైల్వే నెట్‌వర్క్‌ను ఆధునీకరించడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రూట్లలో గంటలకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడపాలని, ఆ మేరకు ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే అన్ని రాష్ట్రలకంటే ముందుగా.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న బీహార్ లో ఈ పనులను రైల్వే శాఖ శరవేగంగా పూర్తిచేయడం గమనార్హం.

జస్టిస్ ఎన్వీ రమణపై 9ఏళ్లుగా ఇలానే - జగన్ కుట్రలకు ఆధారాలివే - ఎంపీ రఘురామ తాజా బాంబుజస్టిస్ ఎన్వీ రమణపై 9ఏళ్లుగా ఇలానే - జగన్ కుట్రలకు ఆధారాలివే - ఎంపీ రఘురామ తాజా బాంబు

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్(మొఘల్‌సరై) నుంచి పాట్నా మీదుగా జమూయీ జిల్లా వరకు ఉన్న 393 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ బీహార్ కు లైఫ్ లైన్ గా కొనసాగుతున్నది. లాక్ డౌన్ కారణంగా ప్యాసింజర్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో ఆ ఖాళీ సమయాన్ని సమర్థవంతంగా వాడుకున్న ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఈసీఆర్).. బీహార్ మెయిన్ లైన్ ను శరవేగంగా ఆధునికీకరించింది.

 Days before bihar elections, Railway upgrades tracks in the state, trains can hit 130 kmph

ఇప్పటిదాకా బీహార్ కు, బీహార్ గుండా వెళ్లిన రైళ్ల అత్యధిక వేగం గంటకు 110కిలోమీటర్ల లోపే ఉండగా.. 130 కి.మీ వేగానికి తగ్గట్లు స్లీపర్లు, రైల్స్(పట్టాలను) కొత్తవి ఏర్పాటు చేశారు. అదే సమయంలో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా పూర్తిగా ఆధునీకరించారు. పనులకు సంబంధించి తమకు జులై, ఆగస్టులో అనుమతులు లభించాయని, ప్రస్తుతానికి 393 కిలోమీటర్ల మొఘల్ సరై-పాట్నా-జుమూయీ మార్గం పూర్తిగా రెడీ అయిందని ఈసీఆర్ అధికారులు చెప్పారు. కాగా..

కేంద్ర ఆర్థిక,రక్షణ శాఖలు వైసీపీకి దక్కుతాయని మావాళ్ల టాక్-ఏపీలో స్మగ్లింగ్‌పై ఢిల్లీ నజర్:రఘురామకేంద్ర ఆర్థిక,రక్షణ శాఖలు వైసీపీకి దక్కుతాయని మావాళ్ల టాక్-ఏపీలో స్మగ్లింగ్‌పై ఢిల్లీ నజర్:రఘురామ

అన్ లాక్ ప్రక్రియలో భాగంగా పరిమిత సంఖ్యలోనే.. కొద్ది రోజుల నుంచి బీహార్ లో రైళ్లు 130కి.మీ వేగంతో తిరుగుతున్నాయి. కానీ, రైల్వే టైమ్ టేబుల్ మార్చకుండానే సర్వీసుల వేగం పెంచడం విచిత్రపరిణామంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సర్వీసుల సంఖ్య తక్కువే అయినా, టైమ్ టేబుల్ ఒకలా, రైళ్ల వాస్తవ రాకపోకలు మరోలా ఉండటంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు.

English summary
Days before the poll bugle was sounded in Bihar, the Union government has upgraded a railway line in the state. The new line can support trains with a speed of 130 km per hour. The objective is not only to accommodate faster trains but also ensure they are on time, in a state that has witnessed perennially high demand for train travel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X