కేజ్రీవాల్ కు పెద్ద షాక్ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. డీడీసీఏ స్కాంపై విచారణకు చట్టబద్దత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విచారణ కమీషన్ ఏర్పాటు రాజ్యంగ విరుద్దమని కేంద్రం పేర్కొంది.
డీడీసీఏ స్కాంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రమేయం తేల్చేందుకు విచారణ కమిషన్ ను ఆప్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డీడీసీఏ స్కాంకు, అరుణ్ జైట్లీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కావాలనే డీడీసీఏ కుంబకోణంలో అరుణ్ జైట్లీని రక్షించడానికి ప్రయత్నిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అశుతోష్ ఆరోపించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం డీడీసీఏ విచారణను అడ్డుకుంటున్నదని మండిపడ్డారు.
డీడీసీఏ స్కాంలో అరుణ్ జైట్లీ ప్రమేయం లేకపోతే విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు అంత భయం అని ప్రశ్నిస్తున్నారు. డీడీసీఏ కుంబకోణంలో అరుణ్ జైట్లీ ఏ తప్పు చెయ్యకపోతే పూర్తిగా సహకరించాలని ఆప్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.