కేజ్రీ సంచలనం: డీడీసీఏలో సెక్స్ రాకెట్ కూడా...!
న్యూఢిల్లీ: డీడీసీఏలో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీడీసీఏ అధికారుల తీరుపై మంగళవారం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ సెలక్షన్స్ కోసం వెళ్లిన వారిపట్ల డీడీసీఏలోని అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
క్రికెట్ సెలక్షన్లో భాగంగా తన కొడుకుని తీసుకుని డీడీసీఏ అధికారుల వద్దకు వెళ్లిన ఓ సీనియర్ జర్నలిస్ట్కు ఎదురైన చేదు అనుభవం తాజాగా తన దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.
'ఓ సీనియర్ జర్నలిస్టు నా వద్దకు వచ్చాడు. తన కుమారుని క్రికెట్ జట్టు సెలక్షన్ కోసం వెళితే అతని భార్యను ఒక నైట్ శారీరక సుఖం కోసం పంపమని ఓ డీడీసీఏ అధికారి అడిగాడట. తానే స్వయంగా ఈ విషయాన్ని నాతో మొరపెట్టుకున్నాడు' అని కేజ్రీవాల్ పేర్కొన్నాడు.
'ఆ జర్నలిస్టు పేరును బయటకు చెప్పాలనుకోవడం లేదు. డీడీసీఏలో జరుగుతున్న అవతవకలకు ఇంతకన్నా నిదర్శనమేమిటి? అంటూ ప్రశ్నించారు. ఇదొక్కటే కాదు. ఈ తరహా ఘటనలు అక్కడ అనేకం' అని అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.
డీడీసీఏలో అవినీతి, ఆర్ధిక అవకతవకలు అనేది ఒక కోణమైతే, అక్కడ సెక్స్ రాకెట్ లాంటివి జరుగుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పటికైనా డీడీసీఏలో అవినీతిపై విచారణను అడ్డుకోవద్దని ప్రధాని నరేంద్ర మోడీకి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా సూచించారు.
What
will
PM
do-
declare
it
illegal
or
allow
enquiry?
Though
it
will
hv
no
impact
on
ongoing
enquiry
comm(2/2)
—
Arvind
Kejriwal
(@ArvindKejriwal)
December
29,
2015
Is
it
true
that
MHA
has
sent
DDCA
file
to
PM
to
decide
whether
to
declare
Enquiry
Commission
illegal(1/2)
—
Arvind
Kejriwal
(@ArvindKejriwal)
December
29,
2015