ఏమైంది? ఒడ్డుకు నిర్జీవంగా వేలాది చేపలు(వీడియో)
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ సరస్సులో స్వేచ్ఛగా తిరగాల్సిన చేపలు నిర్జీవమైపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు.. వేల సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వేల చేపలు నిర్జీవంగా ఉల్సూర్ సరస్సు ఒడ్డున పడి ఉండటం చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
చేపలు చనిపోవడానికి కాలుష్యమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, బెంగళూరులో నగరంలోని సరస్సులు విపరీతంగా కలుషితమవడంతో వాటిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
నగరంలో అత్యంత ఎక్కువగా కలుషితమైన యామ్లూర్ సరస్సులో గత ఏడాది దట్టమైన నురుగు కనిపించి, మంటలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఉల్సూర్ సరస్సులో వేలాది చేపలు చనిపోయి కలకలం రేపుతున్నాయి. కాగా, నగరంలో బోటింగ్కు ఈ సరస్సు ప్రముఖ ఉంది.
Comments
English summary
Thousands of dead fish have surfaced at a lake in the middle of Bengaluru, a city that has been struggling to clean up its badly polluted lakes.
Story first published: Monday, March 7, 2016, 13:38 [IST]