ఒడిశాలో 29 మంది మృతి... సీఎం అధికారిక ప్రకటన
ఒడిశాలో ఫణి తుఫాను సృష్టించిన బీభత్సానికి రాష్ట్ర్రంలో 29 మంది మృత్యువాత పడ్డారని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అధికారికంగా ప్రకటించారు. . కాగా తుఫాన్ తీరం దాటే సమయానికి 230 కిలోమీటర్ల వేగంతో బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో వందల కోట్ల రుపాయల ఆస్థి నష్టం జరిగిందని సీఎం తెలిపారు.
ఫణి తుఫానులో 29 మంది మృతి
ఫణి తుఫాన్ బీభత్సం ఒడిశా రాష్ట్ర్ర ప్రజలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే దీంతో ఆ రాష్ట్ర్రంలో 29 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు ఆ రాష్ట్ర్ర సీఎం నవీన్ పట్నాయక్, ఈనేపథ్యంలోనే ఆస్తుల నష్టం తోపాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కల్గిందని దీంతో సమాచార వ్యవస్థ దెబ్బతిన్నటన్నట్టు ఆయన తెలిపారు. తుఫాను వల్ల లక్షల మంది నిరాశ్రాయులు అయినట్టు కూడ పేర్కోన్నారు. అయితే వీరందని ఆదుకుంటామని సీఎం స్సష్టం చేశారు.
తక్షణ సహాయం ప్రకటించిన సీఎం
తుఫానులో సర్వస్వం కోల్పోయిన కుటుంభాలను ఆదుకునేందుకు సీఎం ప్రభుత్వం తరుఫున సహాయాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగానే పూర్తిగా నష్టపోయిన పూరీ జిల్లాలోని గ్రామాలకు ప్రతి కుటుంభానికి గాను తక్షణ సహయంగా రూ 2000 , లతోపాటు 50 కిలోల బియ్యం,పాలిథీన్ షీట్స్ అందిస్తామని ప్రకటించారు. కాగా పాక్షికంగా నష్టపోయిన వారికి రూ 1000 తోపాటు రేషన్ సరుకులు ,పాలిథీన్ కవర్ లు అందించనున్నట్టు వెళ్లడించారు. కాగా పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ 95100, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.52000 వేలను ప్రకటించారు.మరోవైపు తుఫాను ఎఫెక్టెడ్ ప్రాంతాలకు 15 రోజుల పాటు ఉచితంగా ఆహారాన్ని అందించనున్నట్టు ఆయన ప్రకటించారు.
త్వరలో ప్రధాని పర్యటన
ఒరిశాలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను ప్రధాని మోడీ పరిశీలించనున్నారు. ఒడిశాలో ముఖ్యంగా ఫూరి, ఖుర్ధా, గంజాం జిల్లాలతో పాటు జగత్ సింగ్ పూర్ బాలాసోర్ జిల్లాలో తీవ్రంగా నష్టం జరిగింది. కాగా ఈ ప్రాంతాల్లో మోడీ పర్యటించి తగిన అర్ధిక సహయం చేయనున్నట్టు అధికారులు తెలియచేశారు. కాగా ఇప్పిటికే తుఫాను ప్రభావం పై సిఎం నవీన్ పట్నాయక్ తో ఫోన్లో మాట్లాడారు.