భారత్, పాకిస్థాన్: డిసెంబర్ 16 దారుణాలు
న్యూఢిల్లీ/పేషావర్: భారత్, పాకిస్థాన్ దేశాలలో డిసెంబర్ 16వ తేదిన రెండు ఘోర సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలను రెండు దేశాలు తలుచుకుని విచారం వ్యక్తం చేస్తున్నాయి. శత్రు దేశాల్లో రెండు సంఘటనలు ఒకే రోజు జరిగాయి.
మూడు సంవత్సరాల క్రితం డిసెంబర్ 16వ తేదిన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పారామెడికల్ విద్యార్థిని (నిర్బయ)పై పాశవిక లైంగిక దాడి జరిగింది. సామూహిక అత్యాచారం తరువాత అమ్మాయిని అతి దారుణంగా చంపేశారు.
ఈ సంఘటన తరువాత ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించడానికి జస్టిస్ వర్మ నేతృత్వంలో ప్రత్యేక కమిటి రూపొందించిన చట్టానికి నిర్భయ అనే పేరు పెట్టారు. అయితే ఈ చట్టం అమలు చేసిన తరువాత కూడా భారత దేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
ఉగ్రవాదులను పాలు పోసి పెంచుకున్న పాకిస్థాన్ అదే ఉగ్రవాద పాముల కాటుకు గురైయ్యింది. డిసెంబర్ 16వ తేదిన పేషావర్ లోని మిలటరీ స్కూల్ లో తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన నరమేధంలో దాదాపు 150 మంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఉగ్రవాదుల ఉరిశిక్షల అమలుపై కొనసాగుతున్న మారటోరియాన్ని ఎత్తేసి నాలుగు నెలల్లో 100 మంది ఉగ్రవాదులకు ఉరి శిక్ష అమలు చేసింది. పేషావర్ సంఘటనతో పాక్ అక్కడి ఉగ్రవాదులను అణిచివెయ్యడానికి కఠిన చర్యలు తీసుకునింది.