మోడీని కలుస్తా: శశికళ అంటీ కథ చెబుతా, జయ మేన కోడలు దీపా
అన్నాడీఎంకే పార్టీలోని శశికళ వ్యతిరేక వర్గం ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అమ్మ జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు లేదా సీఎం పన్నీర్ సెల్వంకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇప్పుడు నెచ్చెలి శశికళ మీద ప్రతికారం తీర్చుకోవడానికి తుదిపోరుకు సిద్దం అయ్యారని తెలిసింది. దీపా జయకుమార్ ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తున్నారని సమాచారం.
పన్నీర్ సెల్వం VS శశికళ: చీలిక దిశగా అన్నా'ఢీ'ఎంకే
అన్నాడీఎంకే పార్టీలోని శశికళ వ్యతిరేక వర్గం ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అమ్మ జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు లేదా సీఎం పన్నీర్ సెల్వంకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా శశికళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
దీపా పెరవై అనే సంస్థ పేరుతో జోరుగా సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. జయలలిత వారసురాలిగా మీరు రాజకీయాల్లోకి రావాలని ప్రతి రోజూ దీపా మీద ఒత్తిడి పెరిగిపోతుంది. అయితే సరైన సమయంలో దీపా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఆమె అనుచరులు అంటున్నారు.
నెచ్చెలి'చిన్నమ్మ చిరునవ్వు'మాయం: ఇప్పుడు ఏం చేద్దాం ?
తమిళనాడు రాజకీయాలను బీజేపీ తెరవెనుక ఉండి నడిపిస్తున్నదని ఉవ్వెత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో శశికళ మీద బగ్గుమంటున్న జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకునేందుకు సిద్దం అవుతున్నారు.