కొత్త పార్టీని ప్రకటించిన దీపా , 'ఎంజీఆర్ అమ్మ దీప పేరవై' శశికళకు చెక్ పెట్టేనా?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.
చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.శుక్రవారం సాయంత్రం 'దీపా జయకుమార్ ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ' పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించారు.అయితే ప్రకటించినట్టుగానే దీపాజయకుమార్ పార్టీ పేరును శుక్రవారం నాడుప్రకటించారు.
జయలలిత జయంతి ని పురస్కరించుకొని ఆమె పార్టీని ప్రకటించారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై (ప్రంట్) పేరుతో పార్టీ పేరును ,ప్రకటించారు జయదీపాకుమార్.
ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. జయలలిత మరణించిన తర్వాత అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించడాన్ని ఆమె వ్యతిరేకించింది.దరిమిలా రాజకీయాల్లోకి వస్తానని ఆమె ప్రకటించింది.కొత్త పార్టీ లోగోను దీపా జయకుమార్ ఆవిష్కరించారు.