పరువు నష్టం దావా: ఇల్మీకి బెయిలబుల్ వారంట్
న్యూఢిల్లీ: పరువు నష్టం దావాలో కోర్టుకు హాజరు కానందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన షాజియా ఇల్మీపై ఢిల్లీ కోర్టు శనివారం బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆమెపై, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై మాజీ మంత్రి కపిల్ సిబాల్ కుమారుడు అమిత్ సిబాల్ పరువు నష్టం దావా వేశారు.
తమ ముందు హాజరు కాకపోవడంతో కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేజ్రీవాల్ను, పార్టీ ఇతర నాయకులు మనీష్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్, ఇల్మీలను కోర్టు గత నెల హెచ్చరించింది. సమన్లు జారీ చేసినప్పటికీ తమ ముందు హాజరు కాకపోవడంతో ఇల్మీకి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సునీల్ కుమార్ శర్మ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేశారు.

రూ. 5వేల రూపాయలతో కూడిన బెయిలబుల్ వారంట్ను జారీ చేసినట్లు మెజిస్ట్రేట్ చెప్పారు. ప్రశాంత్ భూషణ్ కోర్టుకు హాజరయ్యారు. మే 22వ తేదీన తండ్రి మరణి్ంచడంతో సోసిడియాకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
మరో కేసులో జైలులో ఉన్నందున కేజ్రీవాల్కు మినహాయింపు కోరుతూ మరో దరఖాస్తు వేయాలని మెజిస్ట్టేర్ ఆయన తరఫున వాదనలు వినిపిస్తున్న శాంతి భూషన్కు సూచించారు. ఆగస్టు 23వ తేదీ కేజ్రీవాల్ హాజరయ్యే విధంగా చూడాలని న్యాయమూర్తి ఆదేశించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications