నితీశ్ ప్రమాణ స్వీకారం: రాహుల్ ఆలస్యానికి కారణం!
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఐదోసారి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని అతిరథులంతా హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడా కనిపించలేదు.
విమాన ఆలస్యం కారణంగానే ప్రమాణ స్వీకారానికి ఆలస్యంగా హాజరైనట్లు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. "ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ, దానికి సంబంధించిన కారణాల వల్ల గంటకు పైగా ఫ్లైట్ ఆలస్యం అయింది. ఇప్పుడే పాట్నాలో లాండ్ అయ్యాను. గాంధీ మైదాన్కు వెళుతున్నా" అని రాహుల్ మూడు గంటల సమయంలో ట్వీట్ చేశారు.
Flight
delayed
by
more
than
an
hour
due
to
air
traffic
control
&
related
issues.
Just
landed
in
Patna!
On
my
way
to
Gandhi
Maidan
now
—
Office
of
RG
(@OfficeOfRG)
November
20,
2015
బిహార్లో మహాకూటమి విజయం తర్వాత రాహుల్లో పెరిగిన ఉత్సాహం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు 27 స్థానాల్లో గెలిచి ఆ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపారు. మధ్యాహ్నాం 2 గంటల సమయంలో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.
నితీశ్ కుమార్ ప్రమాణస్వీకార మహోత్సవానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ బీజేపీ లీడర్ సుశీల్ కుమార్ మోడీ, హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ తదితరులు హాజరయ్యారు. వెంకయ్య నాయుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పక్కనే కూర్చున్నారు.
రెండు లక్షల మంది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్ బీహార్ లో 41 స్థానాల్లో పోటీచేసి 27 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే.