రేప్ చేశాడు: ఏడాది సహజీవనం చేసి 16 ఏళ్ల బాలుడిపై 14 ఏళ్ల బాలిక కేసు
న్యూఢిల్లీ: 16 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక సహజీవనం చేశారు. కొద్ది రోజులకు ఈ మైనర్లు ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయి.. తనను పలుమార్లు రేప్ చేశాడని అతని పైన ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం నాడు వెల్లడించారు.
ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపింది. వీరిద్దరు ఏడాది పాటు సహజీవనం చేశారు. ఆగ్నేయ ఢిల్లీలో జైత్పూర్ ప్రాంతానికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక.. తన పైన పదహారేళ్ల బాలుడు ఏడాది పాటు పలుమార్లు అత్యాచారం జరిపాడని ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు.
తనతో కలిసి ఉంటూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఇద్దరూ స్నేహితులని వారు కలిసి ఉంటూ సంబంధం ఏర్పర్చుకున్నారని పోలీసులు గుర్తించారు. ఏడాది తర్వాత తన ఇంటి నుంచి బాలుడు వెళ్లిపోతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు.
ఇద్దరు మైనర్ల మధ్య కేసును ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. చివరకు బాలిక ఫిర్యాదు మేరకు బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిద్దరు తొలుత స్నేహితులను, ఆ తర్వాత సహజీవనం ప్రారంభించారని పోలీసులు చెప్పారు.