march 19, 2020.. నిద్రలేని రాత్రి, నైట్ నో మీల్, స్నానం చేయకుండానే.. 3.30 గం. వరకు మెల్కోని..
నిర్భయ నలుగురు దోషులు అక్షయ్, ముఖేశ్, పవన్, వినయ్ ఉరిశిక్ష విధించే ఒక్కరోజు ముందు నిద్రలేని రాత్రి గడిపారు. ఉరిశిక్షను తప్పించుకునేందుకు న్యాయ ప్రక్రియలు ముగిసిపోవడం.. ఉరికంబం ఎక్కాల్సి రావడంతో ఆందోళనకు గురయ్యారు. రాత్రి పూట ఆహారం కూడా తీసుకోలేదని తీహార్ జైలు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెల్లవారుజామున ఉరి శిక్ష విధించనుండటంతో దోషులు నలుగురు ఆందోళనతో ఉన్నారని జైలు అధికారులు పేర్కొన్నారు. నలుగురు విడి విడిగా గదుల్లో ఏకాంతంగా ఉన్నారని తెలిపారు. అంతకుముందు రోజులాగా కాకుండా.. రాత్రిపూట ఆహారం కూడా తీసుకోలేదని వివరించారు. తమకు కోర్టుల్లో ఊరట లభిస్తుందోనని తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఉత్కంఠగా ఎదురుచూశారని తెలిసింది. కానీ పాటియాల కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఊరట లభించకపోవడంతో మిన్నకుండిపోయారని తెలుస్తోంది.
తీహార్ జైలులో ఉన్న సమయంలో పవన్, వినయ్, ముఖేశ్ కూలీ పని చేశారు. జైలులో ఉన్న సమయంలో వారు చేసిన పనికి వేతనం వారి కుటుంబసభ్యులకు అందజేస్తామని పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ మాత్రం జైలులో ఎలాంటి పనిచేయలేదు అని.. అతని వస్తువులను మాత్రం కుటుంబసభ్యులకు అందజేస్తామని తెలియజేశారు. మరోవైపు జైలులో ఉండగా వినయ్ శర్మను తలను గోడకేసి కొట్టుకున్న సంగతి తెలిసిందే.
Recommended Video
నలుగురు నిందితులను ఉరితీసిన తర్వాత.. 30 నిమిషాల పాటు వేలాడతీశారు. తీహార్ జైలు వైద్యుడు నలుగురు నిందితులు చనిపోయారని నిర్ధారించిన తర్వాతే వదిలేశారు. తర్వాత పోస్టుమార్టం కోసం దీన్దయాళ్ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు సభ్యుల బృందం పోస్టుమార్టం చేసి.. కుటుంబసభ్యులకు అప్పగించింది.