కుప్పకూలిన కోచింగ్ సెంటర్ భవనం: ఐదుగురు మృతి, 13మందికి తీవ్రగాయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. భజన్పురాలో నిర్మాణంలో ఉన్న భవనం శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. పైకప్పు కూలిన ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
#UPDATE: 12 students have been rescued from the site where an under construction building collapsed in Bhajanpura, today. Rescue operations underway. https://t.co/1jFsk3PYO3 pic.twitter.com/7hBDKN904x
— ANI (@ANI) January 25, 2020
మృతుల్లో నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఈ భవనంలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. క్లాసులు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం జరిగింది.
మూడంతస్తుల భవనం రెండవ, మూడవ అంతస్తులో నిర్మాణం జరుగుతోందని.. శనివారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఆకస్మాత్తుగా భవనం పైకప్పు కుప్పకూలిపోయిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సమాచారం అందిన వెంటనే రక్షణ సహాయక చర్యలను చేపట్టడానికి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు.
दिल्ली के भजनपुरा इलाके में कोचिंग सेंटर की छत गिर गई है, 11 छात्रों को अस्पताल ले जाया गया है|अभी रेस्क्यू ऑपरेशन जारी है, कई के फंसे होने की आशंका है| pic.twitter.com/tXA006oLjx
— Anurag Dhanda (@anuragdhanda) January 25, 2020
ఘటనా స్థలంలో ఏడుగురుని కాపాడాయని చెప్పారు. సుమారు మరో 15 మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, మరికొద్ది సేపట్లో ఘటనా స్థలానికి వెళ్లనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.