వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అలర్ట్: 2 ఎయిరిండియా విమానాలకు ఖలీస్తానీ ఉగ్రవాది బెదిరింపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రెండు ఎయిరిండియా విమానాలను లండన్ చేరుకోవడానికి అనుమతించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాద గ్రూపు నుంచి బెదిరింపులు రావడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జస్టిస్ ఫర్ సిఖ్స్(సిక్కులు) అనే గ్రూపు ఈ హెచ్చిరికలు జారీ చేసింది.

Delhi airport on alert: Khalistani group threatens it wont let 2 Air India flights reach London tomorrow

ఈ విషయం గురించి జాతీయడి మీడియాతో ఎయిర్‌పోర్టు డీసీపీ రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. "జస్టిస్ ఫర్ సిఖ్స్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి చాలా మందికి బెదిరింపు కాల్స్ చేశారు, నవంబర్ 5 న రెండు ఎయిరిండియా విమానాలు లండన్‌లో ల్యాండ్ కావొద్దంటూ ఈ గ్రూపు హెచ్చరించింది.

ఈ మేరకు అందిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు, విమానాశ్రయ అధికారులతో పాటు ఎయిర్ ఇండియా, విమానాశ్రయానికి కాపలాగా ఉండే సిఐఎస్‌ఎఫ్‌లు అప్రమత్తమయ్యారు.

ఖలీస్తానీ గ్రూప్ నుంచి నవంబర్ 5 బెదిరింపు.. న్యూఢిల్లీలో జరిగిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల 36 వ వార్షికోత్సవం సందర్భంగా రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. విస్తృత తనిఖీలు చేపడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు.

English summary
Delhi's Indira Gandhi International Airport has been put on aleart following terror threats from a Khalistani group that has warned that it won't allow two Air India flights to reach London tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X