వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Delhi assembly results 2020: గోలీమార్ అంటే ప్రజలు బీజేపీ గోచి లాగేశారు, ప్రకాష్ రాజ్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతుంది. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థినై 13, 508 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. హస్తిన తీర్పుతో బీజేపీకి లాగి లెంపకాయ కొట్టినట్లు అయ్యిందని, ఢిల్లీలోని కేజ్రీవాల్ విజయం సామాన్యుడి విజయం అని బహుబాష నటుడు, దర్శక నిర్మాత, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ అన్నారు. గోలి బార్ అని పిలుపునిచ్చిన బీజేపీ గోచి లాగేవారని, ఢిల్లీ ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీకి ఉరి వేశారని నటుడు ప్రకాష్ రాజ్ వ్యంగంగా ట్వీట్ చేశారు. ఇకనైనా బీజేపీ నాయకులు బుద్దిగా ఉండాలని ప్రకాష్ రాజ్ సూచించారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: ఆపని మాత్రం చెయ్యోద్దు ఫ్లీజ్, సీఎం కేజ్రీవాల్ మనవి, సంబరాలు, హామీ ఇచ్చాం !ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: ఆపని మాత్రం చెయ్యోద్దు ఫ్లీజ్, సీఎం కేజ్రీవాల్ మనవి, సంబరాలు, హామీ ఇచ్చాం !

బీజేపీ పగటి కలలు, ఆప్ మెరుపుకలలు

బీజేపీ పగటి కలలు, ఆప్ మెరుపుకలలు

బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు పగటి కలలు కన్నారని, అయితే అమ్ ఆద్మీ పార్టీ మెరుపుకలలతో ఆ పార్టీ నాయకుల కలలు భగ్నం అయ్యాయని నటుడు ప్రకాష్ వ్యంగంగా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని నటుడు ప్రకాష్ రాజ్ చెప్పారు.

బీజేపీకి లాగి లెంపకాయ కొట్టారు

బీజేపీకి లాగి లెంపకాయ కొట్టారు

హస్తిన (ఢిల్లీ) ఫలితాలతో బీజేపీకి ప్రజలు ఉరిశిక్ష వేశారని, తుపాకి గుళ్ల వర్షం కురిపించండి అని పిలుపునిచ్చిన బీజేపీ నాయకులకు అక్కడి ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారని నటుడు ప్రకాష్ రాజ్ వ్యంగంగా అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను శిక్ష, ఉరిశిక్ష అనే అర్థం వచ్చేటట్లు నటుడు ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాలను ట్వీట్ చేశారు.

 గోలిబార్ అంటే ప్రజలు మీ గోచి లాగేశారు !

గోలిబార్ అంటే ప్రజలు మీ గోచి లాగేశారు !

గోలిబార్ గురించి మాట్లాడిన బీజేపీ నాయకులకు ప్రజలు సరైన రీతిలో ఓటు అనే ఆయుధంతో జవాబు ఇచ్చారని ప్రకాజ్ రాజ్ అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ నాయకులను విమర్శిస్తూనే అమ్ ఆద్మీ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

కేంద్ర మంత్రి ఠాకూర్

కేంద్ర మంత్రి ఠాకూర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్బంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిని తుపాకితో కాల్చి సరైన బుధ్ది చెప్పాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయ్యింది. ఇప్పుడే అదే విషయం ముందు పెట్టుకుని నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ నాయకులను విమర్శిస్తున్నారు.

ఏ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలి !

ఏ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలి !

ఢిల్లీ ఎన్నికల పోలింగ్ రోజు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ప్రజలకు అవసరమైన అన్నీ సౌకర్యాలు ఇచ్చే ప్రభుత్వం కావాలా, లేక ప్రజల హక్కులను లాక్కొనే ప్రభుత్వం కావాలా ? మీరే తేల్చుకోండి అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం (అమ్ ఆద్మీ పార్టీ) విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించిందో, అదే సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (బీజేపీ) స్కూల్ పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించిందో మీరే చూడంటి అంటూ ఓ ఫోటో జతచేసి ట్వీట్ చేశారు. మొత్తం మీద ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్బంగా నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు.

English summary
Actor Prakash RaJ on Delhi assembly election results 2020: It is a capital punishment. People beat with broom whom asked to shoot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X