ఢిల్లీలో పుంజుకొన్న బీజేపీ, 3 సీట్ల నుంచి 15 సీట్ల వరకు..? బీజేపీ ఓటుబ్యాంకు తగ్గడానికి కారణమిదేనా.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దూసుకెళ్తోంది. బీజేపీ కూడా ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఆప్ 54 చోట్లలో లీడ్లో ఉండగా.. బీజేపీ 15 నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతోన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క చోట మాత్రమే లీడ్లో ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇతరుల జాడ కనిపించడం లేదు.
పెరిగిన ఓటు బ్యాంకు
2015 ఎన్నికలతో పోల్చితే బీజేపీ ఓటు బ్యాంకు పెరిగినట్టు అనిపిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈ సారి 15 చోట్ల లీడ్లో ఉంది. ఇందులో కనీసం సగం సీట్లలో విజయం సాధించిన బీజేపీకి అది ప్లస్ అవుతోంది. 3 నుంచి 8 సీట్ల నుంచి 10 సీట్లు సాధించిన.. ఆ పార్టీ పుంజుకున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
కనిపించని కాంగ్రెస్
ఇక కాంగ్రెస్ పార్టీ జాడ కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ 2-3 చోట్ల మాత్రమే గెలుస్తోందని చెప్పినా.. ప్రస్తుతం ఒక్క చోట మాత్రమే లీడ్లో ఉంది. ఇతరులు ప్రభావం ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో కనిపించడం లేదు. కానీ బీజేపీ మాత్రం పుంజుకొని ప్రతిపక్ష పాత్ర పోషించనుంది.
కారణమిదేనా..?
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వెనకబడటానికి పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడమేనని విశ్లేషకులు భావిస్తోన్నారు. షహీన్బాగ్, జమియా మిలియా ఇస్లామియా వర్సిటీలో జరిగిన నిరసనలు ఇందుకు అద్దంపడుతోన్నాయి. మరోవైపు ఢిల్లీలో 2015 కంటే పోలింగ్ తగ్గినా.. ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ పెరిగింది. ఈ ఓటు బ్యాంకు అంతా..బీజేపీని వ్యతిరేకించేవారని తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా.. ఆప్కే ఓటు వేసినట్టు తెలుస్తోంది..