వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆవుపై కేసు పెట్టిన వ్యాపారి, గాలింపు చేపట్టిన పోలీసులు, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తన కాలికి గాయమైన ఆవుపై కేసు నమోదు చేయాలని డిల్లీకి చెందిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఆవు కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు కారణమైన వ్యక్తుల గురించి ఫిర్యాదు చేస్తే వారిని వెతుకుతారు. ప్రమాదానికి కారణమైన వాహనాలను సీజ్ చేస్తారు. కానీ, డిల్లీలో జరిగిన ఈ ఘటన వీటన్నింటితో పోలిస్తే కొంత భిన్నంగా ఉంది.

Delhi businessman files complaint against cow

డిల్లీకి చెందిన ఓ వ్యాపారి ఈ ఏడాది మార్చి 27 వ తేదిన మాతా షేర్వాలి మార్కెట్ గుండా తన టూ వీలర్‌పై వెళ్తున్నాడు. అయితే ఓ ఆవు వచ్చి వ్యాపారి టూవీలర్ ను ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి కాలికి తీవ్ర గాయమైంది.

దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తన కాలికి గాయానికి కారణమైన ఆవుపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆవు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆవును గుర్తించేందుకు పోలీసులు తంటాలు పడుతున్నారు.

English summary
A Delhi businessman has registered a police complaint against a cow following a road accident which left him with a fractured leg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X