delhi clashes: అమిత్ షా రాజీనామా చేయాలని సోనియాగాంధీ డిమాండ్
ఈశాన్య ఢిల్లీలో జరుగుతోన్న ఆందోళనలకు కేంద్ర హోంమంత్రి బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. 20 మంది మరణానికి, పదుల సంఖ్యలో గాయపడేందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శాంతి భద్రతల బాధ్యత హోంశాఖదని.. మరి ఆ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ పార్టీ నేత రెచ్చగొట్టే ప్రసంగం చేస్తుంటే మిన్నకుండిపోయారా అని ప్రశ్నించారు.
ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల బాధాకరమని సోనియాగాంధీ అన్నారు. కానీ ఘటనకు హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. శనివారం నుంచి ఆందోళనలు జరుగుతోన్న పోలీసు శాఖ ఏం చేస్తుందని ఆమె ప్రశ్నించారు.
నిఘా విభాగం ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయలేదని అడిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా నైతిక బాధ్యత వహించాలని సోనియాగాంధీ అన్నారు. ఆందోళనలు జరుగుతోన్న అదుపులోకి తీసుకొచ్చేందుకు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఢిల్లీలో పరిస్థితి దిగజారేందుకు గల కారణాలు ఏంటీ అని ఆరు ప్రశ్నలను సంధించారు.
Recommended Video
ఢిల్లీ ఘర్షణలో మృతుల సంఖ్య 20కి చేరింది. మంగళవారం వరకు 13 మంది చనిపోగా.. బుధవారం మరో ఏడుగురు చనిపోయారు. జీటీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు మృతిచెందారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు కేంద్ర మంత్రివర్గానికి ఢిల్లీ పరిస్థితిని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వివరించనున్నారు.