ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో చోరీ, కంప్యూటర్, విలువైన పత్రాలు మాయం
డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయంలో దొంగతనం జరిగింది. ఈ కార్యాలయంలోని కంప్యూటర్లు, విలువైన పత్రాలను దొంగిలించారు.కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
న్యూఢిల్లీ:సామాన్యుల కార్యాలయాలు, ఇళ్లలోనే కాదు ఏకంగా డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయంలోనే దొంగలుపడ్డారు. దొంగలు దొంగతనం చేయడమే కాకుండా కార్యాలయాన్ని కూడ ధ్వంసం చేశారు.
సామాన్యులకే కాదు, డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడ రక్షణ లేకుండా పోయింది డిల్లీలో. డిల్లి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయంలో శుక్రవారం నాడు దొంగలుపడ్డారు. దొంగలు కార్యాలయంలో కంప్యూటర్ ను విలువైన పత్రాలను దోచుకెళ్ళారు.
శుక్రవారం రాత్రి పూట గుర్తుతెలియని వ్యక్తులు డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయంలో దొంగతనం చేశారు. రెండు కంప్యూటర్లతో పాటు విలువైన పత్రాలను దోచుకెళ్ళారు. డిల్లీలోని పత్పర్ గంజ్ లోని కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.
అయితే ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ సమయంలో దొంగతనం జరిగిందనేది ఖచ్చితంగా చెప్పలేమన్నారు పోలీసులు . సిసిటీవి కెమెరాలనుఆప్ చేసి సిసికెమెరాకు అనుసంధానం చేసిన కంప్యూటర్ ను కూడ ఎత్తుకెళ్ళారని పోలీసులు చెప్పారు.