ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత
Recommended Video
ఢిల్లీ: రాజకీయ కురవృద్ధురాలు సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.శనివారం ఉదయం పరిస్థితి కాస్త సీరియస్గా మారడంతో ఆమెను 10:30 గంటలకు ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటలకు షీలా దీక్షిత్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
We regret to hear of the passing of Smt Sheila Dikshit. Lifelong congresswoman and as three time CM of Delhi she transformed the face of Delhi. Our condolences to her family and friends. Hope they find strength in this time of grief. pic.twitter.com/oNHy23BpAL
— Congress (@INCIndia) July 20, 2019
We are deeply saddened by demise of Former Delhi Chief Minister Sheila Dixit ji. We offer our heartfelt sorrow and condolences to Sheila Ji's family.
— AAP (@AamAadmiParty) July 20, 2019
May her soul Rest in peace.
Om Shanti! 💐#SheilaDixit pic.twitter.com/Ya6XNOL4hd
ఢిల్లీ రాజకీయాల్లో షీలా దీక్షిత్ ప్రముఖ పాత్ర పోషించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె 15 ఏళ్లు సేవలందించారు. ఇక షీలా దీక్షిత్ మృతి యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీకి వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పొచ్చు. షీలా దీక్షిత్తో సోనియాగాంధీకి మంచి స్నేహం ఉంది. రాజకీయా వ్యూహాలు ఇద్దరు కలిసి రచించేవారు. ఇదిలా ఉంటే షీలా దీక్షిత్ మృతికి కాంగ్రెస్ సంతాపం తెలిపింది. ఈ మేరకు ట్విటర్లో పోస్టు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు సేవలందించిన షీలా దీక్షిత్... ఢిల్లీ రూపురేఖలనే మార్చారని కాంగ్రెస్ కొనియాడింది. షీలా దీక్షిత్ కుటుంబ సభ్యులకు మిత్రులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు కాంగ్రెస్ ట్విటర్లో పేర్కొంది
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి వార్త తనను కలచివేసిందని ఆమె కుటంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఢిల్లీ అభివృద్ధికి ఆమె ఎనలేని కృషి చేశారని మోడీ కొనియాడారు. ఓం శాంతి అంటూ తన ట్వీట్ను ముగించారు.ఇదిలా ఉంటే షీలా దీక్షిత్ మృతికి సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఇతర రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.