వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం తాగించి మహిళపై డ్రైవర్, కండక్టర్ గ్యాంగ్‌రేప్

|
Google Oneindia TeluguNews

ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళపై బస్సు డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి కొట్వాలి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.

40 ఏళ్ల బాధితురాలు బస్సు కోసం ఎదురు చూస్తుండగా, ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ బ్రీజేంద్ర, కండక్టర్ జితేంద్ర ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అత్యాచారానికి ముందు బాధితురాలికి నిందితులు బలవంతంగా మద్యం తాగించారు. కాగా, బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు బస్సు వద్దకు చేరుకున్నారు. బాధితురాలిని కాపాడిన స్థానికులు, ఇద్దరు నిందితులను చితకబాదారు.

సమాచారం అందుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

Delhi gangrape throwback: Woman assaulted inside a moving bus in Jhansi

ప్రాణం తీసిన మెమొరీ కార్డు

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా తులసీపురంలో దారుణం జరిగింది. మెమొరీ కార్డు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళ్తే.. అనిల్(16) అనే యువకుడు తన ఇంటికి సమీపంలోని శోభారామ్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్‌లో నుంచి మెమొరీ కార్డును దొంగిలించాడు.

ఇది గమనించిన శోభారామ్.. అనిల్‌కు విషమిచ్చి దారుణంగా కొట్టాడు. ఇంటికి చేరుకున్న అనిల్ వాంతులు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అనిల్ కుటుంబ సభ్యులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే అనిల్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు శోభారామ్ పరారీలో ఉన్నాడు.

English summary
A woman was gangraped by the driver and conductor of a bus in Jhansi on Monday night bringing back memories of the December 2013 Delhi gangrape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X