పరిష్కారం దిశగా.. బయో-డి కంపౌజర్తో కాలుష్యానికి చెక్, కరోనాకు కూడా: కేజ్రీవాల్
ఢిల్లీ.. దేశ రాజధాని, శబ్ద కాలుష్యం దేవుడికి ఎరుగు.. వాయు కాలుష్యం మాత్రం ఎక్కువే. వాహనాల వల్ల ఏర్పడే పొల్యూషన్తో ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు పక్కనగల హర్యానా కారణమవుతోంది. అక్కడ వరి పంట, ఇతర పంట పూర్తయిన తర్వాత చేలను కాలబెడుతుంటారు. దీంతో పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంటోంది. దీని ద్వారా కూడా కాలుష్య ప్రభావం చూపిస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇవాళ మీడియాకు సీఎం కేజ్రీవాల్ వివరించారు. దీంతోపాటు కరోనా వైరస్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయని చెబుతున్నారు.
పంట చేలను తగులబెట్టే క్రమంలో పూసాకు చెందిన ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిష్కారం కనుకొందని తెలిపారు. బయో-డికంపౌజర్తో పంట చేలను దగ్దం చేయొచ్చని తెలిపారు. దీంతో కాలుష్యం తగ్గుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. బయో-డీ కంపౌజర్ పరిసరాల్లో స్ప్రే చేస్తే చాలు పొల్యూషన్ సమస్య ఉత్పన్నం కాదు అని తెలిపారు.
కరోనా వైరస్ కేసులు కూడా పొల్యూషన్ వల్ల పెరుగుతున్నాయని కేజ్రీవాల్ తెలిపారు. దీనికి సంబంధించి 7-10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గురువారం ఒక్కరోజు ఢిల్లీలో కరోనా వైరస్ సోకి 104 మంది చనిపోయారు. ఢిల్లీలో అధికంగా7 వేల 53 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీతోపాటు, హర్యానాలో పంటకు కోసిన తర్వాత చేలను దహనం చేస్తుంటారు. దీనికితోడు బాణాసంచా కూడా ఒక కారణం అవుతుంది.