వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒక్కడిని చంపేందుకు 50 బుల్లెట్లు.. సినీ ఫక్కీలో గ్యాంగ్ వార్..
ఓ హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైన ఓ వ్యక్తిని ప్రత్యర్థులు కాల్చి చంపిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఔటర్ ఢిల్లీలోని కంజవాలాలో అతని స్కార్పియో వాహనాన్ని ప్రత్యర్థులు వెంబడించారు. ఆ క్రమంలో అతన్ని చంపేందుకు దాదాపు 50 బుల్లెట్లు కాల్చారు. చివరకు బుల్లెట్ గాయంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
గ్యాంగ్ వార్లో భాగంగానే ఈ ఘటన జరిగినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్డీ మిశ్రా తెలిపారు. మృతుడిని కరాలా గ్రామానికి చెందిన అంచిల్గా గుర్తించినట్టు చెప్పారు. ప్రత్యర్థులు కూడా స్కార్పియో వాహనంలోనే అతన్ని వెంబడించినట్టుగా తెలుస్తోందన్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని,హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టాడమని డీసీపీ వెల్లడించారు.
Comments
English summary
Released from jail recently in an attempt to murder case, a man travelling in his Scorpio car was gunned down by a group of men who fired at least 50 bullets at him in outer Delhi's Kanjhawala on Wednesday night, said SD Mishra, deputy commissioner of police
Story first published: Thursday, February 20, 2020, 13:59 [IST]