వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాహేతర సంబంధం: భార్యపై యాసిడ్ దాడి, మరో మహిళకు గాయాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భార్యపై అనుమానంతో ఓ భర్త యాసిడ్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్యతో పాటు మరో మహిళ కూడ తీవ్రంగా గాయపడింది. బాధితులిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకొంది.

న్యూఢిల్లీకి చెందిన రితేష్ అనే వ్యక్తి మహిళను కొంత కాలం క్రితం వివాహం చేసుకొన్నాడు.అయితే తన భార్యకు మరోక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని రితేష్ అనుమానించడం మెదలు పెట్టాడు ఈ విషయమై భార్యతో పలుమార్లు గొడవకు దిగేవాడు

ఈ విషయమై భర్త పెట్టే వేధింపులు భరించలేక భార్య నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది అయితే తన భార్యపై కోపం తగ్గని రితేష్ ఆమెను చంపేయాలని ప్లాన్ చేసుకొన్నాడు.

 Delhi Man throws acid on sleeping wife, another woman

పుట్టింట్లో ఉన్న భార్యను చంపేందుకు పథకం ప్రకారం వెళ్ళాడు. పుట్టింట్లో నిద్రిస్తున్న భార్యపై తన వెంట తెచ్చుకొన్న యాసిడ్‌ను మే 8వ తేదిన పోశాడు. అంతేకాదు భార్య పక్కనే మరో మహిళ కూడ ఆ సమయంలో పడుకొని ఉంది. యాసిడ్ ఇద్దరిపై పడింది. దీంతో ఇద్దరు కూడ తీవ్రంగా గాయపడ్డారు.

బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో వైపు రితేష్ పై గతంలో చైన్‌స్నాచింగ్ కేసులు కూడ ఉన్నాయని పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలను చేపట్టినట్టు చెప్పారు.

English summary
Two women sustained burn injuries after the husband of one of them allegedly threw acid on them on the suspicion that his wife was having an extra-marital affair in Paharganj, police said on May 8.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X