వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆ దారిలో జిగ్నేష్ మేవానీ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు నో
న్యూఢిల్లీ: ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ర్యాలీకి పార్లమెంటు స్ట్రీట్లో అనుమతి లేదని ఢిల్లీ డీసీపీ సోమవారం తెలిపారు. జనవరి 9న పార్లమెంటు స్ట్రీట్లో మేవానీ ర్యాలీకి నిర్ణయించారు. కానీ దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు.
నిర్వాహకులు తమ ర్యాలీకి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఢిల్లీ డీసీపీ ట్వీట్ చేశారు. 2017లో ఎన్జీటీ జంతర్ మంతర్ వద్ద అన్ని రకాల ధర్నాలు, ఆందోళనలను బ్యాన్ చేసింది. పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది.
తాజాగా, సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో మేవానీ, అస్సాం ప్లీసాంట్ లీజర్ అఖిల్ గొగోయ్ల నేతృత్వంలో జనవరి 9న ర్యాలీకి నిర్ణయించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పలువురు రానున్నారని తెలుస్తోంది.
Comments
English summary
Late on Monday night, 8 January, the DCP of New Delhi said no permission was granted to Vadgam MLA Jignesh Mewani to hold a rally on 9 January at Parliament Street in view of the orders placed by the National Green Tribunal. The tweet further said that the organisers were advised to find an alternate area to hold their rally.
Story first published: Tuesday, January 9, 2018, 10:12 [IST]