షాకింగ్ వీడియో: పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్పై గుంపు దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఆనంద్ వీహార్ పోలీస్ స్టేషన్లోనే ఓ పోలీసు అధికారిని కొందరు గుంపుగా వచ్చి దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గుంపుగా వచ్చిన వ్యక్తులు.. ఆ పోలీసు చుట్టూ చేరి తీవ్రంగా కొట్టారు. అయితే, ఈ దాడిని ఎవరూ అడ్డుకోలేదు.. కానీ, ఫొటోలు, వీడియోలు తీశారు. ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.
దాడి చేసిందెవరు?
కానిస్టేబుల్ పై దాడి చేసిన ఓ వ్యక్తిని కర్కర్డోమా గ్రామానికి చెందిన 29 ఏళ్ల సతీష్ కుమార్ గా గుర్తించారు. మరో వ్యక్తిని ఈ దాడి ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ స్టేషన్లో అసలేం జరిగింది?
జూలై 30వ తేదీ రాత్రి 11.27 గంటలకు కర్కర్దూమా గ్రామంలో మహిళపై దాడి చేసి బంగారు గొలుసు పగలగొట్టినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. కర్కర్దూమా గ్రామానికి చెందిన అంచల్ బక్షి, అజయ్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ వివాదం నెలకొంది. మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన అజయ్ను సంఘటనా స్థలం నుంచి పట్టుకుని తదుపరి విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
#WATCH | Delhi: A viral video shows some people beating up the head police constable inside Anand Vihar Police Station in Shahdara
— ANI (@ANI) August 6, 2022
Preliminary probe shows that the video is of 31st July & now legal action is being taken against it: Delhi Police official
(Note: Strong language) pic.twitter.com/5oC7UGsNQZ
ఆ తర్వాత, అజయ్ సోదరుడు సతీష్ చౌదరి, ఇతరులు పోలీస్ స్టేషన్కు వచ్చి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని తెలిపారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (షహదర) ఆర్ సత్యసుందరం. ఇంతలో హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. దీంతో అతన్ని చుట్టుముట్టారు, దుర్భాషలాడారు. ఈ వ్యక్తులు దాడి చేశారని పోలీసులు తెలిపారు.
దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.