పొగమంచు ఎఫెక్ట్: 15రైళ్లు రద్దు, ఆలస్యంగా మరో 20రైళ్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని మంగళవారం పొగమంచు కప్పేయడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మంగళవారం ఉదయం 9.6డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో దారి కనిపించక 18రైళ్లను రద్దు చేశారు.
బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో సుమారు 20రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. మరో 15రైళ్లను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. పొగమంచుకు కారణంగా మరో రెండు రైళ్ల సమయాలను మార్చాడం జరిగిందని తెలిపారు.
Air Quality Index of #Delhi's Lodhi Road area, prominent pollutants PM 2.5 & PM 10 remain in 'poor' category. pic.twitter.com/jQ5r9MrmCC
— ANI (@ANI) December 20, 2017
ఢిల్లీలో బుధవారం పొగమంచుతోపాటు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీ ప్రజలు ఉదయం 8గంటలు దాటితే గానీ, ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కాగా, ఢిల్లీ గాలి కాలుష్యం కూడా తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.