ఢిల్లీ అల్లర్లు : మృతుల వివరాలు ఇవే..
ఢిల్లీ అల్లర్లలో మృతి చెందిన 37 మంది వివరాలను పోలీసులు విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. మృతుల్లో 21 మంది బుల్లెట్ గాయాలతో చనిపోయారు. నలుగురు కత్తిపోట్లు,దాడుల కారణంగా మృతి చెందగా.. మరో ముగ్గురు కాలిన గాయాలతో మృతి చెందారు. ఇక మరో నలుగురి మృతికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు.మృతుల్లో 15 మంది ముస్లింలు,10 మంది హిందువులు ఉండగా.. మిగతా మృతుల మతాల గురించి ఇంకా స్పష్టత రాలేదు. మృతుల్లో అందరికంటే చిన్నవాడు అమన్(17), అందరికంటే పెద్దవాళ్లలో ఇద్దరు 70 ఏళ్ల వృద్దులు ఉన్నారు. మొత్తంగా మృతుల్లో 29 మంది పురుషులు,ఒక మహిళ ఉన్నారు. మిగతా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మృతుల్లో 34 మంది గురు తేజ్ బహదూర్(GTB) ఆసుపత్రిలో మృతి చెందినట్టు నిర్దారించారు. మిగతావారు లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రిలో మృతి చెందినట్టు నిర్దారించారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి దాదాపు 215 మంది బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందించినట్టు జీటీబీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 51 మంది పేషెంట్స్ మాత్రమే ఉన్నట్టు చెప్పారు. వారిలో ఒకరి పరిస్థితి తప్ప మిగతా అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.
మృతుల వివరాలు : 1.రతన్ లాల్ (హెడ్ కానిస్టేబుల్ ACP ఆఫీసు, గోకుల్పురి),2.ముబారిక్3. మహమ్మద్ ముదాశీర్ (30),4.మహమ్మద్ ఫుర్కాన్ (30),5.దీపక్ (34),6.ఇస్త్యాక్ ఖాన్ (24),7.విర్భన్,8.వినోద్ (45),9.అంకిత్ శర్మ(26),10.దిల్బర్,11.షాన్ మహమ్మద్(35),12.పర్వేష్(48),13.జకీర్(24),14.రాహుల్ ఠాకూర్(23),15.రాహుల్ సోలంకి(26),16.మెహ్తాబ్(22),17.అష్ఫక్(22),18.షాహిద్(25),19.అమన్(17),20.మరుఫ్(32),21.సల్మాన్,22.ఫైజాన్(24),23.అలోక్ తివారీ(32),24.ఇర్ఫాన్(25),25.బబ్బూ(32)