బంధువుపై కానిస్టేబుల్ రేప్, మరోచోట రేప్కు సహకరించిన భర్త అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం జరిగింది. 30 ఏళ్ల మహిళ పైన పోలీసు కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నార్త్ ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో డిసాస్టర్ టీంలో నిందితుడైన కానిస్టేబుల్కు పోస్టింగ్ ఇచ్చారు. ఈ సమయంలో అతను మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డారు.
అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తనకు నిందితుడు బంధువే అవుతాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. వెస్టి ఢిల్లీలోని నారేలా ప్రాంతంలో తాను ఇంటిలో ఉన్నప్పుడు అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపింది.
రేప్ కేసులో వ్యక్తి అరెస్టు
తన భార్య పైన బంధువు అత్యాచారానికి సహకరించిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో బంధువు ఒకరు భార్య పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి భర్త సహకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. భర్తను అరెస్టు చేశారు.