బీజేపీకి ఓటు వెయ్యని వారు పాకిస్థానీలు
న్యూఢిల్లీ: బీజేపీకి ఓటు వెయ్యని 70 శాతం మంది భారతీయులు పాకిస్థానీలే అని ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా ట్విట్టర్ లో వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు మంత్రి కపిల్ మిశ్రా మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
బీజేపీ ఎంపీ యోగీ ఆదిత్యనాథ్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ పాకిస్థాన్ టైస్ట్ సయిద్ హఫీజ్ తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పాకిస్థాన్ టైస్ట్ సయిద్ హఫీజ్ అయితే పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఓ మండేలా అని ట్విట్ చేశారు.
గత అక్టోబర్ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ ముఖ్యమంత్రిని మండేలాతో పోల్చారు. అయితే ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా మాత్రం భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఓ గొప్ప విషయం అంటూ వ్యంగంగా ట్విట్టర్ లో పోస్టు చేశారు.
భారత్ లో మత అసహనం పెరిగిపోతుందని బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ చెప్పిన విషయం తెలిసిందే. షారుక్ ఖాన్ మీద బీజేపీ నాయకులు అనేక విదాలుగా మండిపడ్డారు. ఈ సందర్బంలో వీటిపైన స్పందించిన ఢిల్లీ మంత్రి ఈ విదంగా వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు.