ఫ్లిప్ కార్ట్కు కన్నం వేశారు: రూ. 37 లక్షలు లూటీ, ఉదయం వచ్చి చూస్తే!
ఫ్లిప్ కాట్ సంస్థకు చెందిన కార్యాలయంలో చొరబడిన దుండగులు రూ. 37 లక్షలు లూటీ చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. దుండగులు ముసుగులు వేసుకుని వచ్చి నగదు లూటీ చేశారని సోమవారం ఢిల్లీ నగర పోలీసులు చెప్పారు.
న్యూఢిల్లీ: ఫ్లిప్ కార్ట్ సంస్థకు చెందిన కార్యాలయంలో చొరబడిన దుండగులు రూ. 37 లక్షలు లూటీ చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. దుండగులు ముసుగులు వేసుకుని వచ్చి నగదు లూటీ చేశారని సోమవారం ఢిల్లీ నగర పోలీసులు చెప్పారు.
హీరోయిన్ ను కారులోనే నలుగురు, వీడియో, కోట్లు ఇవ్వకుంటే నీ పేరు; హీరోకి వార్నింగ్ !
ఢిల్లీలోని జల్మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్లిప్ కార్ట్ కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి ఫ్లిప్ కార్ట్ తన ఖాతాదారులకు కావలసిన వస్తువులు సరఫరా చేస్తుంటారు. ఆదివారం అర్దరాత్రి ముగ్గురు దుండగులు ముసుగులు వేసుకుని కార్యాలయంలో చొరబడ్డారు.
తరువాత లాకర్లు పగలగొట్టిన దుండుగులు నగదు, డిజిటల్ వీడియో రికార్డర్లు లూటీ చేసి పరారైనారు. సోమవారం కార్యాలయంలోకి వచ్చిన సిబ్బంది చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లిప్ కార్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.