ఒళ్లు గగుర్చొడించే రియల్ సీన్: అత్త,మామ గొంతునులిమిన అభినవ కోడలు..
అవును.. భర్త, ఇద్దరు పిల్లలు ఉండగా తన అత్త,మామలను మట్టుబెట్టింది అభినవ కోడలు. ఆస్తి వివాదమో, మరే కారణమో తెలియదు తెలియదు గానీ.. అత్త, మామలను కోడలు కవిత సింగ్ మట్టుబెట్టింది. పశ్చిమ ఢిల్లీలో చావ్లాలో గల దుర్గావిహార్లో శుక్రవారం ఉదయం జరిగిన ఘటనతో దేశ రాజధాని ఉలిక్కిపడింది.
ఎప్పటిలానే రాజ్ సింగ్, ఒమ్వతీ దంపతులు శుక్రవారం కూడా నిద్రలేచారు. కానీ వారికి కోడలు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. తన అత్త, మామ గొంతును కవిత నులిమి మట్టుబెట్టింది. తన తల్లిదండ్రులను కవిత.. హతమారుస్తుండగా కుమారుడు సతీష్ సింగ్ అక్కడే ఉన్నారు. అతని ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. సతీష్ ప్రోద్బలంతోనే హత్య జరిగిందా..? మరే కారణం ఉందా అనే కోణంలో విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.
Recommended Video
హత్య గురించి పోలీసులకు సమాచారం రావడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. దుర్గావిహర్ ఫేజ్-2 చేరుకొని.. బెడ్పై ఉన్న మృతదేహాలను పరిశీలించారు. కవిత, ఆమె భర్తను పోలీసులు ప్రశ్నించారు. మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది.