కిరాతకం: మద్యం తాగించి టెక్కీల గ్యాంగ్ రేప్, బాల్కనీ నుండి బాధితురాలిలా...
న్యూఢిల్లీలోని 26 ఏళ్ళ మహిళలపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.అయితే నిందితుల నుండి తప్పించుకొనేందుకుగాను బాధితురాలు 20 అడుగుల ఎత్తు ఉన్న బాల్కనీ నుండి దూకింది.
న్యూఢిల్లీ: 26 ఏళ్ళ మహిళ న్యూఢిల్లీలో గ్యాంగ్ రేప్ కు గురైంది. గంటల పాటు ఆమె అత్యాచారానికి గురైంది.అయితే ఆమె నిందితుల నుండి తప్పించుకొని బాల్కనీ నుండి కిందకు దూకింది. స్థానికులు సహయాన్ని ఆమె ఆర్థించింది.అయితే ఆమెను చిరిగిన బట్టలతో ఉన్న ఆమెను చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
26 ఏళ్ళ మహిళ 20 అడుగుల ఎత్తులో ఉన్న బాల్కనీ నుండి దూకింది. ఐదురుగు నిందితులు ఆమెపై గంటల కొద్దీ అత్యాచారానికి పాల్పడ్డారు.అయితే నిందితుల నుండి తప్పించుకొనేందుకుగాను ఆమె 20 అడుగుల ఎత్తులో ఉన్న బాల్కనీ నుండి కిందకు దూకింది. సహయం కోసం చిరిగిన బట్టలతోనే డిల్లీ రోడ్లపై పరుగెత్తింది.సహయం కోసం ఆమె ఆర్థించింది. కాని ఎవరూ కూడ ఆమెకు సహయం చేసేందుకు గాను ముందుకు రాలేదు.చివరకు ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిస్తే బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
లక్ష్యా బల్లా, వికాస్ కుమార్, నవీన్ , ప్రతీక్ లు స్నేహితులు వీరంతా కూడ కాల్ సెంటర్ లో పనిచేస్తుంటారు.ఢిల్లీకి సమీపంలోని నోయిడాలోని కాల్ సెంటర్ లో వారు ఉద్యోగం చేస్తున్నారు. టెక్ మహేంద్ర కంపెనీలో పనిచేసే స్వారిత్ కూడ ఈ ఘటనలో పాల్గొన్నాడు.
శనివారం నాడు వికాస్ కుమార్ కు తెలిసిన ఓ మహిళను ఆయన తీసుకువచ్చాడు.ఆ మహిళకు ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు.అయతే శనివారం నాడు వికాస్ కుమార్ కు ఆ మహిళతో పరిచయం ఉంది.అయితే వికాస్ కుమార్ ఆమెను ఢిల్లీలోని పాండవ్ నగర్ లోని తన ప్లాట్ ను తీసుకువచ్చాడు. అయితే వికాస్ కుమార్ ఆ మహిళను తీసుకువస్తుండగా వికాస్ కుమార్ ఇద్దరు స్నేహితులు మార్గమధ్యలో జాయిన్ అయ్యారు.
వికాస్ కుమార్ తన ప్లాట్ లోకి తీసుకెళ్ళగానే ఆమెకు బలవంతగా ఆల్కహల్ ను తాగించారు. ఆమెను గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.శనివారం నుండి ఆదివారం తెల్లవారుజామువరకు ఐదురుగు నిందితులు బాధితురాలిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
ఆదివారం తెల్లవారుజామున బాల్కనీ నుండి ఆ మహిళ కిందకు దూకింది. 20 అడుగుల ఎత్తులో ఉన్న బాల్కనీ నుండి ఆమె దూకింది.నిందితుల నుండి తప్పించుకొనేందుకు బాల్కనీ నుండి కిందకు దూకడమే మార్గంగా తోచిందని బాధితురాలు చెప్పారు. చిరిగిన బట్టలతో ఆమె రోడ్డుపై తనకు సహయం చేయాలని ఆమె పలువురిని కోరింది.అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు బాధితురాలని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. బాల్కనీ నుండి ఆమె కిందకు దూకడం వల్ల ఆమె కాళ్ళకు స్వల్పగాయాలైనట్టుగా పోలీసులు తెలిపారు.