Lady SI: శ్వేత‘నాగు’సినిమా స్టైల్లో స్కెచ్, రేప్ కేస్ డీల్, రూ. 35 లక్షలు, టార్చర్ తో కథ క్రైమాక్స్
అహ్మదాబాద్: కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు మహిళలపై ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (MD)అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. మీ మీద అత్యాచారం చేశానని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఈ విషయం బయటకు తెలిసినా, మీ నగ్న వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామనని, మీ ప్రాణాలు తీస్తామని ప్రైవేట్ కంపెనీ ఎండీ ఇద్దరు మహిళలను బెదరించాడని ఆ ఇద్దరు మహిళలు కేసు పెట్టారు. అత్యాచారం కేసుతో పాటు సంఘవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న సదురు ఎండీని కేసు నుంచి తప్పించడానికి ఓ Lady SI శ్వేతనాగు సినిమా స్టైల్లో రూ. 35 లక్షలు డిమాండ్ చేసింది. అడ్వాన్స్ గా రూ. 20 లక్షలు లంచం తీసుకుని మరో రూ. 15 లక్షలు ఇవ్వాలని టార్చర్ చెయ్యడంతో కథ క్లైమాక్స్ కు చేరి కటకటాలపాలైయ్యింది.
Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !
లేడీ ఎస్ఐ సినిమా స్టైల్ బిల్డప్
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో శ్వేతా జడేజా సబ్ ఇన్స్ పెక్టర్ (SI)గా ఉద్యోగం చేస్తున్నది. ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నా ఎస్పీ లెవల్లో శ్వేతా జడేజా ఫోజులు ఇస్తుంటుందని ఆరోపణలు ఉన్నాయి. సినిమాల్లో లేడీ పోలీసు అధికారులు ఎలా టిప్పుటాప్ గా ఉంటారో అలాగే లేడీ ఎస్ఐ శ్వేతా జడేజా బిల్డప్ లు ఇస్తుంటారు. శ్వేతా జడేజా తీసుకున్న ఫోటోలు, వాటిని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు చూస్తే ఆమె బిల్డప్ ఎలాగుంటుందో అర్థం అవుతోంది.
ఎండీ కామాంధుడు
అహ్మదాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తున్న వ్యక్తి చాలా కామాంధుడు అని ఆరోపణలు ఉన్నాయి. అదే కంపెనీలో కొందరు మహిళలు ఉద్యోగం చేస్తున్నారు. ఆ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరి మీద ఆ ఎండీ కన్ను వేశాడు. అయితే కంపెనీ ఎండీ ప్రలోభాలకు లొంగని ఆ మహిళలను ఎలాగైనా అనుభవించాలని చాలాకాలం ఎండీ వేచి చూశాడు.
2019లో అత్యాచారం
2019వ సంవత్సరంలోనే ఇద్దరు మహిళల మీద ఆ కంపెనీ ఎండీ వేర్వేరు సందర్బాల్లో అత్యాచారం చేశాడు. మహిళల మీద అత్యాచారం చేసిన సమయంలో ఆ కంపెనీ ఎండీ రహస్యంగా వీడియోలు తీశాడని తెలిసింది. తాను అత్యాచారం చేశానని పోలీసులకు కాని, మరెవరికైనా కాని విషయం చెప్పినా మీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, ప్రపంచం మొత్తం ఆ వీడియోలు చూస్తారని, మీ పరువు పోతుందని, అంతేకాకుండా మిమ్మల్ని చంపేస్తానని ఆ ఎండీ ఇద్దరు మహిళలను బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి.
రేప్ కేసు లడ్డూ దొరికినట్లు దొరికింది
2019లోనే అహ్మదాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో బాధిత ఇద్దరు మహిళలు కంపెనీ ఎండీ మీద అత్యాచారం, బెదిరింపులు, బ్లాక్ మెయిల్ కేసులు పెట్టారు. అప్పటి నుంచి ఆ కేసు విచారణలో ఉంది. ఇదే సమయంలో అహమ్మదాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో లేడీ ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న శ్వేతా జడేజాను కేసు విచారణ చెయ్యాలని పై పోలీసు అధికారులు సూచించారు. ఈ కేసు శ్వేతా జడేజాకు లడ్డూ దొరికినట్లు అయ్యింది.
కిలాడీ లేడీ ఎస్ఐ రూ. 35 లక్షలకు డీల్
అత్యాచారం కేసు పెట్టిన ఇద్దరు మహిళలు, కంపెనీ ఎండీని పలుమార్లు పోలీస్ స్టేషన్ కు పిలిపించిన లేడీ ఎస్ఐ శ్వేతా జడేజా హంగామా చేసింది. తమ మీద కంపెనీ ఎండీ అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేశాడని ఇద్దరు మహిళలు గట్టిగానే లేడీ ఎస్ఐ శ్వేతా జడేజాకు చెప్పారు. అయితే ఈ కేసు నుంచి మమ్మలి తప్పించాలని, మీరు ఎంత డబ్బులు అడిగితే అంత ఇస్తామని కంపెనీ ఎండీ సోదరుడు భూపేష్ లేడీ ఎస్ఐ శ్వేతా జడేజా కాళ్లు పట్టుకున్నాడు. ఈ కేసు నుంచి మిమ్మల్ని తప్పించాలంటే తనకు రూ. 35 లక్షలు లంచం ఇవ్వాలని లేడీ ఎస్ఐ శ్వేతా జడేజా నిందితుడి సోదరుడు భూపేష్ ను డిమాండ్ చేసింది.
రూ. 20 లక్షలు స్వాహా
రూ. 35 లక్షలు ఇచ్చుకోలేమని, రూ. 20 లక్షలు అయితే ఇస్తామని నిందితుడి సోదరుడు భూపేష్ ఓ మధ్యవర్తి సహాయంతో లేడీ ఎస్ఐ శ్వేతా జడేజాకు మనవి చేశారు. సరే ఓకే అని రూ. 20 లక్షలు లంచం తీసుకున్న లేడీ ఎస్ శ్వేతా జడేజా వారం రోజుల పాటు సైలెంట్ గా ఉండిపోయింది. తరువాత మళ్లీ నిందితుడి సోదరుడు భూపేష్ ను పిలిచి తనకు రూ. 20 లక్షలు సరిపోదని, మిగిలిన రూ. 15 లక్షలు ఇస్తేనే మీ సోదరుడిని అత్యాచారం కేసు నుంచి తప్పిస్తానని బెదిరించింది.
లేడీ ఎస్ఐ టార్చర్ దెబ్బతో కథ క్లైమాక్స్
రూ. 15 లక్షలు ఇవ్వాలని లేడీ ఎస్ఐ శ్వేతా జడేజా టార్చర్ ఎక్కువ చెయ్యడంతో నిందితుడి సోదరుడు భూపేష్ అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించి విషయం మొత్తం చెప్పాడు. క్రైమ్ బ్రాంచ్ పోలీసుల స్కెచ్ ప్రకారం భూపేష్ నుంచి రూ. 15 లక్షలు లంచం
తీసుకుంటున్న శ్వేతా జడేజాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. ఒక్క కేసుకు రూ. 35 లక్షలు డీల్ చేసిన లేడీ ఎస్ఐ శ్వేతా జడేజా గతంలో ఆమె ఇంకా ఎంత మందిని ఇలా బెదిరించి లంచం తీసుకుంది ? అని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ అజయ్ తోమర్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద లేడీ ఎస్ శ్వేత జడేజా తన శ్వేతనాగు స్వరూపం చూపించడంతో కటకటాలపాలైయ్యింది.