ప్రభుత్వ కారు, అయితే ఏం, ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు డ్రైవర్ దూల తీరింది!
బెంగళూరు: కొత్త మోటారు చట్టం అమలులోకి వచ్చిన తరువాత ట్రాఫిక్ పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారి మీద పంజా విసిరుతున్నారు. ప్రభుత్వ వాహనాల డ్రైవర్ ల నుంచి ట్రాఫిక్ పోలీసులు అపరాద రుసుం వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు కొందరు ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల దూల తీరిపోయింది.
ఆ ఊరిలో ఒక్క ముస్లీం లేడు, హిందువులే మొహరం, బళ్లారి దేవత, మైసూరు రాజులు !
కర్ణాటకలోని దావణగెరెలోని పీబీ రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు పరిశీలించారు. ఆ సమయంలో కర్ణాటక మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన కారు అటు వైపు వెళ్లింది. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వ కారును నిలిపి పరిశీలించారు.
కారు డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు అపరాద రుసుం విదించారు. అదే సమయంలో అటు వైపు ప్రభుత్వ వాహనాలు వచ్చాయి. నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల నుంచి అపరాద రుసుం వసూలు చేశారు.
దూల తీరింది, బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు ఎన్ని రూ. లక్షలు వసూలు చేశారంటే!
సామాన్యులు అయినా, ప్రభుత్వ వాహనాలు నడుపుతున్న వారు అయినా సరే నియమాలు ఉల్లంఘిస్తే అపరాద రుసుం వసూలు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వ వాహనాల డ్రైవర్లకు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.