వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేవదాసి వ్యవస్థ: ఏపీ, తమిళనాడులకు నోటీసులు
సామాజిక దురాచారమైన దేవదాసి వ్యవస్థ కొనసాగుతుందన్న ఆరోపణలపై తమిళనాడు, ఏపీలకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది.
అమరావతి/చెన్నై: సామాజిక దురాచారమైన దేవదాసి వ్యవస్థ కొనసాగుతుందన్న ఆరోపణలపై తమిళనాడు, ఏపీలకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది.
తమిళనాడు తిరువల్లూరు జిల్లాలో మాతమ్మతల్లి దేవాలయానికి తీసుకెళ్లి బాలికలు, మహిళలను బలవంతంగా దేవదాసీలుగా మారుస్తున్నారని వచ్చిన ఫిర్యాదులు, మీడియాలో వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేసినట్టు కమిషన్ వెల్లడించింది.
తమిళనాడు, ఆంధ్రలో మహిళలను దేవదాసీలుగా మారుస్తున్నారన్న ఆరోపణలు నిజమైతే ఆది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని కమిషన్ పేర్కొంది. ఇది విద్యా, బాలల హక్కుల హరించినట్లేనని కమిషన్ స్పష్టం చేసింది.
దీనిపై తమిళనాడు, ఏపీ డిజిపిలకు తమిళనాడు (తిరువళ్లూరు), ఆంధ్ర (చిత్తూరు) జిల్లా మెజిస్ట్రేట్లు ఎస్పీలకు నోటిసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల్లో సమయం ఇచ్చింది.
Comments
English summary
In a shocking practice that has shades of the ancient devadasi system, virtually in Chennai's backyard, girls dressed as brides take part in a ceremony which ends with young boys stripping them naked, an NGO has complained. They are then forced to live in temples in Tiruvallur district as public property'.
Story first published: Tuesday, September 26, 2017, 21:23 [IST]