మధ్యంతరం పై యూ టర్న్ తీసుకున్న దేవేగౌడ...నేను చెప్పింది ఎన్నికల గురించి కాదు ..!
త్వరలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేసిన జేడేఎస్ నేత దేవేగౌడ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో యూ టర్న్ తీసుకున్నారు. దీంతో తాను చేసింది స్థానిక సంస్థల ఎన్నికల కోసమని చెప్పారు. అయితే దేవేగౌడ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కుమార స్వామీ సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. దేవేగౌడ సైతం తాను చేసింది స్థానిక సంస్థల ఎన్నికల కోసమే గాని, అసెంబ్లీ ఎన్నికల కోసం కాదని అన్నారు.
కాగా కర్ణాటకలో జరగుతున్న రాజకీయా పరిణామాల నేపథ్యంలో దేవేగౌడ మధ్యంతరం పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయిదు సంవత్సరాల పాటు తమకు మద్దతు తెలుపుతామని ప్రమాణం చేసిందని, తన మాటను నిలబెట్టుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదని ఆయన వ్యాఖ్యనించారు. మరోవైపు కర్ణాటక ప్రజలు తెలివిగల వారని వారు కాంగ్రెస్ చేస్తున్న చర్యలను ఎప్పుటికప్పుడు గమనిస్తున్నారని అన్నారు.
ఈనేపథ్యంలోనే లోక్సభలో కాంగ్రెస్ పార్టీ గురించి పరాజయం గురించి మాట్లాడిన దేవేగౌడ రాష్ట్రంలో అలయెన్స్ ప్రభుత్వం ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియదని అన్నారు.అయితే నా వైపు నుండి ఎలాంటీ ప్రమాదం లేదని కాంగ్రెస్ పార్టీ చేతులో ఉందని స్సష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే సంకీర్ణ ప్రభుత్వం ఎర్పడిందన్న ఆయన పార్టీ ఒప్పందాల కోసం గులామ్నబీ అజాద్ అశోక్ గెహ్లాట్ బెంగళూరుకు వచ్చారని ఆయన తెలిపారు. ఈనేపథ్యంలోనే గతంలో సంకీర్ణ ప్రభుత్వాల తీరుపై వివరించానని అన్నారు.అయితే ముఖ్యమంత్రిగా మల్లికార్జున ఖార్టే పేరును సైతం తాను సూచించాని కాని కాంగ్రెస్ హైకమాండ్ ఇందుకు ఒప్పుకోలేదని అన్నారు. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయాలని రాహుల్ గాంధి భావించారని అన్నారు. In a surprising admission, Janata Dal