వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హతమారుస్తాం: మహారాష్ట్ర సీఎంకు మావోయిస్టుల బెదిరింపు లేఖ

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఆయన కుటుంబసభ్యులను హతమారుస్తామని ఏకంగా సీఎం కార్యాలయానికే మావోయిస్టులు బెదిరింపు లేఖ పంపించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మృత్యువాత పడిన ఘటనను ఈ లేఖలో మావోయిస్టులు ప్రస్తావించారు.

కొద్దిమంది కామ్రేడ్లను నిర్మూలించడంతో విప్లవం ఆగదని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. సీఎం కార్యాలయానికి బెదిరింపు లేఖ అందడంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసులు తెలిపారు. బెదిరింపు లేఖపై అధికారులు, భద్రతాదళాలు విచారణ జరుపుతున్నాయని తెలిపారు.

Devendra Fadnavis gets threat letters over anti-Maoist operations

మరోవైపు ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ గడ్చిరోలి జిల్లా భంరగ తాలూకాలో కరపత్రాలు, బ్యానర్లు వెలిశాయి. అత్యున్నత స్థాయి వ్యక్తులకు బెదిరింపు లేఖ రావడం ఒకేరోజులో ఇది రెండవది కావడం గమనార్హం.

రాజీవ్‌గాంధీని హతమార్చిన తీరులో ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్రపన్నినట్టు ఈ మేరకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించారని పుణే పోలీసులు వెల్లడించారు. అందుకు సంబంధించిన లేఖను వారు విడుదల చేశారు.మావోయిస్టులు గత ఏడాది ఏప్రిల్‌లో ఆ లేఖను రాసినట్టు తెలిసింది.

English summary
Maharashtra chief minister Devendra Fadnavis has received two threat letters allegedly from Maoist organisations which were handed over to the police, sources in the state home department said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X