వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala : శబరిమల మండల పూజకు భారీగా తగ్గిన భక్తులు ... ఆలయం వద్ద కరోనా నియమాలు

|
Google Oneindia TeluguNews

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అయ్యప్ప స్వామి కొలువుతీరిన క్షేత్రమైన శబరిమల క్షేత్రాన్ని దర్శించడం కోసం భక్తులు వెళుతున్నారు. శబరిమలలో వార్షిక మండల, మకర విళక్కు పూజల కోసం రెండు నెలలపాటు ఆలయాన్ని తెరచిన నేపథ్యంలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆన్ లైన్ లో దర్శనం స్లాట్ బుక్ చేసుకోవడం, కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళడం, ఆలయం వద్ద కరోనా నియమాలు పాటించడం వంటి కారణాల నేపథ్యంలో చాలా మంది భక్తులు ఈసారి శబరిమల యాత్రకు వెళ్ళని పరిస్థితి నెలకొంది.

Sabarimala : అయ్యప్ప మాలధారులపై కరోనా ఎఫెక్ట్ ... శబరిమలకు వెళ్ళే భక్తుల సంఖ్య ఈ సారి తక్కువే !!Sabarimala : అయ్యప్ప మాలధారులపై కరోనా ఎఫెక్ట్ ... శబరిమలకు వెళ్ళే భక్తుల సంఖ్య ఈ సారి తక్కువే !!

మండల పూజల కోసం భక్తులు అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధానం వద్దకు చేరుకున్నారు. భక్తులు సామాజిక దూరాన్ని పాటించేలా అక్కడ ఉన్న వాలంటీర్లు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్ లను ధరించటం తప్పని సరి కావడంతో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్వామి దర్శనం చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

Devotees lower this time for Sabarimala Mandala pooja ... Corona rules in the temple

కరోనా వైరస్ కేరళలో పంజా విసురుతుంది . కరోనావైరస్ పరిమితుల కారణంగా ఆలయ ప్రాంగణంలో మునుపటి సంవత్సరాలతో పోలిస్తే తక్కువ భక్తులు వచ్చినట్టుగా అధికారిక అంచనా . మహమ్మారి ప్రారంభంలో ఆలయాలు ఏడు నెలల మూసివేత తరువాత, అక్టోబర్ 16 నుండి భక్తుల కోసం శబరిమల ఆలయాన్ని తెరిచారు .
అప్పటి నుండి కఠినమైన కోవిడ్ నియమాలతో భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
English summary
Devotees reached Sannidhanam to offer prayers to Lord Ayappa for Mandala pooja as the annual Sabarimala pilgrimage season begins in Kerala amid the pandemic.Social distancing is being maintained by the volunteers and wearing of masks has been made compulsory.The temple premises saw less devotees compared to previous years due to coronavirus restrictions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X