మౌని అమావాస్య ఎఫెక్ట్.. కుంభమేళాకు క్యూ కట్టిన భక్తులు
లక్నో : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు, దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. పవిత్రస్నానాలు ఆచరించి భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఆ క్రమంలో సోమవారం నాడు మౌని అమావాస్య కావడంతో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. మౌని అమావాస్య రోజు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాదిగా తరలివచ్చారు. కుంభమేళా సందర్భంగా ముక్కోటి దేవతలు త్రివేణి సంగమంలో కొలువుదీరుతారనేది భక్తులు ప్రగాఢ విశ్వాసం. ముక్కోటి దేవతలను స్మరించుకుంటూ గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంకగాంధీ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. అయితే కుంభమేళాలో రెండవ షాహి స్నాన్ గా పిలిచే మౌని అమావాస్య (ఫిబ్రవరి 4) రోజున సోదరుడు రాహుల్ తో కలిసి ఆమె పవిత్ర స్నానం ఆచరించనున్నారు. అది కుదరనిపక్షంలో మూడవ షాహి స్నాన్ గా పిలిచే బసంత పంచమి (ఫిబ్రవరి 10) రోజున పుణ్యస్నానం ఆచరించి.. అదే రోజు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ కనిపిస్తోంది.
Varanasi: Devotees take holy dip in river Ganga on the occasion of 'Mauni Amavasya' pic.twitter.com/KIJNYub8Ih
— ANI UP (@ANINewsUP) February 4, 2019
Prayagraj: Visuals from #KumbhMela2019 on the day of second 'shahi snan' #MauniAmawasya pic.twitter.com/qbGBKEY8Ui
— ANI UP (@ANINewsUP) February 4, 2019
Prayagraj: #Visuals from #KumbhMela2019 ahead of second 'shahi snan' pic.twitter.com/h9NuOjXVIo
— ANI UP (@ANINewsUP) February 4, 2019