పుల్వామా దాడి సమయంలో మోడి బిర్యాని తిని పడుకున్నారు. అసదుద్దిన్ ఓవైసి
పుల్వామా దాడి జరిగినప్పుడు ప్రధాని మోడి, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బీఫ్ బిర్యాని తిని పడుకున్నారా అంటూ ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసి విమర్శించారు.
కొడుకు, కోడలు గెంటేశారు.. కోర్టులో అమ్మ విజయం
ప్రధాని మోడి ,రాజ్ నాథ్ సింగ్ లు ఢిల్లిలో కూర్చుని పాకిస్తాన్ లోని బాలకోట్ టెర్రరిస్టు క్యాంప్ లో మూడువందల సెల్ ఫోన్లు ఉన్నాయని గుర్తించిన వాళ్లు 50 కిలోల ఆర్డీఎక్స్ ను ఉపయోగించి పుల్వామా దాడికి కారణమైన వాడిని గుర్తించలేకపోయారా అని ఎద్దేశా చేశారు.బహుశా ఆ సమయంలో వాళ్లిద్దరు పెద్ద కూర బిర్యాని తిని (బీఫ్ బిర్యాని) ఫుల్ గా తిని పడుకున్నారని ఎగతాళి చేశారు.
హైద్రబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఆయన పై విధంగా స్పందించారు.కాగా బాలకోట్ దాడి పిఎమ్ మోడి కనుసన్నల్లో జరిగిందని అన్నారు..అయితే రాజకీయ లబ్ధికోసమే బాలకోట్ దాడి చేశారని ఆరోపించారు.ఈనేపథ్యంలో బాలకోట్ దాడిలో పార్టీ అధ్యక్షుడు 250 మంది మృతి చెందారని ప్రకటిస్తే, రాజ్ నాథ్ సింగ్ 300 వ్యవసాయ శాఖ మంత్రి 400మంది మృతి చెందారని చెప్పారని అన్నారు.