దీదీ దాదాగిరీ : సొంత ఇలాకాలో ధర్నా .. కారణమిదే ?
కోల్కతా : టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం, ఫైర్ బ్రాండ్ మమత బెనర్జీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో విసుగెత్తిపోయిన ఆమె .. గురువారం ఆందోళనకు సిద్ధమయ్యారు. బెంగాల్ లో నిరసన చేపడుతానని సంచలన ప్రకటన చేశారు దీదీ.
దీదీ ది ఫైర్ బ్రాండ్ ...
మమత బెనర్జీ అంటేనే ఫైర్ బ్రాండ్. అధికారంలో ఉన్నా ,లేకున్నా ఆమె మ్యానరిజం వేరు. ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతన్న పరిణామాలతో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కారణమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు .. టీఎంసీ నేతలు బీజేపీలో చేరికలతో మమత మూడ్ మొత్తం మారింది. దీంతో గురువారం ధర్నా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
సీఎం ఆందోళన
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి .. తాను పాలిస్తున్న రాష్ట్రంలో ధర్నాకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. నైహతి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతానని దీదీ ప్రకటించారు. ఎన్నికలకు ముందు బీజేపీ, టీఎంసీ మధ్య చెలరేగిన హింస నేపథ్యంలో ఇళ్లు కోల్పోయిన వారికి కటట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి గూడు లేదని .. వెంటనే ఇళ్లు కట్టించాలని మమత అల్టిమేటం జారీచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో టీఎంసీ కార్యకర్తలు భయంతో వణికిపోతున్నారని .. వెంటనే వారికి తగిన న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఎక్కడ కోల్పోయామో ...
మమత ఆందోళన చేపట్టే ప్రాంతానికి కూడా ప్రాధాన్యం ఉంది. నైహతి మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు నిన్న బీజేపీలో చేరారు. దీంతో ఎక్కడ కోల్పోయామో అన్న సామెతను మమత గుర్తుతెచ్చుకున్నట్టున్నారు. ఇక్కడే ఆందోళన చేపట్టడానికి అదే కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్టీ నుంచి ఉన్న నేతలు వెళ్లేందుకు సాహసించేందుకు కూడా భయపడాలనే ధోరణిలో మమతా ఉన్నట్టు స్పష్టమవుతుంది. తన రాష్ట్రంలో మమత సీఎంగా ఆందోళనకు దిగడం చర్చానీయంశం కాగా .. ఇదివరకు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ధర్నా చేపట్టారు. అప్పుడు కేజ్రీ .. ఇప్పుడు మమత సొంత రాష్ట్రంలో ఆందోళనకు దిగి .. అందరిచూపు తమవైపు పడేట్లు చూసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.