పోటీ పడండి, విలీనానికి కెసిఆర్ సానుకూలం: దిగ్విజయ్
అనంతరం డిగ్గీ మాట్లాడారు. త్వరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. సోనియాతో భేటీ సమయంలో విలీనంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చర్చించారని, విలీనం విషయంలో తదుపరి అంశాలపై చర్చించవలసి ఉందన్నారు. సోనియాతో భేటీ సమయంలో విలీనంపై సానుకూలంగా స్పందించారన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు రెండు వేర్వేరు పిసిసిలు, ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
కాంగ్రెసు పార్టీ తన వాగ్ధానాలను నిలబెట్టుకుంద్నారు. మార్చిలో సీమాంధ్రలో బహిరంగ సభలు ఉంటాయని, సోనియా, రాహుల్ గాంధీలు పాల్గొంటారన్నారు. సీమాంధ్రకు ఐదేళ్ల ప్రతిపత్తి, పదేళ్ల పాటు పన్ను రాయితీ ఇస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సోనియాకు, రాహుల్కు, కాంగ్రెసుకు కెసిఆర్ కృతజ్ఢతలు చెప్పడం సంతోషకరమన్నారు.
మంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ.. సీమాంధ్ర సమస్యలను తాము సోనియాకు వివరించామని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. సోనియా గాంధీ అందుకు సానుకూలంగా స్పందించారని చెప్పారు.
మరోవైపు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి పికె మహంతి బుధవారం ఉదయం ఢిల్లీ బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డేతో పాటు అందుకు అనుగుణంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన కేంద్ర హోంశాఖతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర సూచనలు,ఆదేశాలకనుగుణంగా ఢిల్లీ నుంచి వచ్చాక సిఎస్ మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.