వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటీ పడండి, విలీనానికి కెసిఆర్ సానుకూలం: దిగ్విజయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Digvijay on Telangana notification
న్యూఢిల్లీ: అభివృద్ధిలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు పోటీ పడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం అన్నారు. పలువురు సీమాంధ్ర నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో డిగ్గీతో పాటు కేంద్రమంత్రి జెడి శీలం, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు కాసు వెంకటకృష్ణా రెడ్డి, డొక్కా మాణిక్య వర ప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణ, రామచంద్రయ్య, బాలరాజు, రఘువీరా రెడ్డి, వట్టి వసంత్ కుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, అహ్మదుల్లా తదితరులు పాల్గొన్నారు.

అనంతరం డిగ్గీ మాట్లాడారు. త్వరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. సోనియాతో భేటీ సమయంలో విలీనంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చర్చించారని, విలీనం విషయంలో తదుపరి అంశాలపై చర్చించవలసి ఉందన్నారు. సోనియాతో భేటీ సమయంలో విలీనంపై సానుకూలంగా స్పందించారన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు రెండు వేర్వేరు పిసిసిలు, ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

కాంగ్రెసు పార్టీ తన వాగ్ధానాలను నిలబెట్టుకుంద్నారు. మార్చిలో సీమాంధ్రలో బహిరంగ సభలు ఉంటాయని, సోనియా, రాహుల్ గాంధీలు పాల్గొంటారన్నారు. సీమాంధ్రకు ఐదేళ్ల ప్రతిపత్తి, పదేళ్ల పాటు పన్ను రాయితీ ఇస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సోనియాకు, రాహుల్‌కు, కాంగ్రెసుకు కెసిఆర్ కృతజ్ఢతలు చెప్పడం సంతోషకరమన్నారు.

మంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ.. సీమాంధ్ర సమస్యలను తాము సోనియాకు వివరించామని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. సోనియా గాంధీ అందుకు సానుకూలంగా స్పందించారని చెప్పారు.

మరోవైపు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి పికె మహంతి బుధవారం ఉదయం ఢిల్లీ బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డేతో పాటు అందుకు అనుగుణంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన కేంద్ర హోంశాఖతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర సూచనలు,ఆదేశాలకనుగుణంగా ఢిల్లీ నుంచి వచ్చాక సిఎస్ మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

English summary
AP Congress Party incharge Digvijay Singh on Wednesday said notificaion on Telangana will release soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X