వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని నరసింహారావుతో మాట్లాడుతారు: నోరుజారిన మంత్రి, 'చూసి మాట్లాడండి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మంత్రి దిండుకల్ శ్రీనివాస్ నోరు జారారు. ప్రస్తుత మన ప్రధాన నర్సింహా రావు అంటూ పేర్కొన్నారు. దిండుకల్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్‌ మాట్లాడుతూ లోకసభ ఉప సభాపతి తంబిదురై గురించి ప్రస్తావించారు.

ప్రస్తుతం ఆయన పరమత్తి వేలూర్‌లోప్రజల సమస్యలు వింటున్నారని, మరికాసేపట్లో కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సాయంత్రం పుదుకోట్టై వెళ్లి తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని నరసింహరావుతో మాట్లాడుతారని చెప్పారు. ఏకంగా ప్రధాని పేరును మార్చి చెప్పడంతో అందరూ విస్తుపోయారు.

Dindigul Sreenivasan at it again, calls Narasimha Rao Prime Minister

అనంతరం మరో కార్యక్రమంలో తంబిదురై, దిండుకల్‌ శ్రీనివాసన్ పాల్గొన్నారు. అక్కడ దిండుకల్ శ్రీనివాసన్‌ మాట్లాడేందుకు కుర్చీలో నుంచి లేస్తుండగా.. 'చూసి మాట్లాడండి' అని తంబిదురై సూచన చేశారు.

గతంలోను సదరు మంత్రి ప్రధానిపేరును మోడీకి బదులు మన్మోహన్ సింగ్ అని చెప్పారు. అలాగే మదురైలో జరిగిన బహిరంగసభలో భారతరత్న ఎంజీఆర్‌అని చెప్పడానికి బదులుగా భారత ప్రధాని ఎంజీఆర్‌ అన్నారు.

English summary
In a meeting held at Vedasandur in Dindigul district on Saturday, Sreenivasan praised the work of Deputy Speaker M Thambidurai. He said that Thambidurai is on a whirlwind tour of meeting people in various places and he would come to Vedasandur too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X