అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకం పోయింది ,సుప్రిం మాజీ ఉద్యోగిని
సుప్రిం చీఫ్ జస్టీస్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రిం ప్రత్యేక బెంచ్ క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనపై ఆరోపణలు చేసిన సుప్రిం మాజీ ఉద్యోగిని స్పందించింది. తాను బెంచ్ తీర్పువల్ల తీవ్రమనోవేదనకు గురయ్యానని తెలపడంతో పాటు నా భయాలు నిజమయ్యాయని పేర్కోంది. దీంతోపాటు అత్యున్నత న్యాయస్థానం పై ఆశలు దెబ్బతిన్నాయని తెలిపింది.
కమిటి తీర్పుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎస్సి మాజీ ఉద్యోగిని
''ఈరోజు నా భయాలు నిజమయ్యాయి. న్యాయంపై తనకున్న అన్ని ఆశలు వమ్ముకావడంతో పాటు అన్యాయనికి గురైన వారికి అత్యున్నత న్యాయస్థానం న్యాయం జరగకుండా తలుపులు మూసివేసిందని'' ఆమే అవేదన వ్యక్తం చేసింది. కాగా రంజన్ గొగోయ్ పై సుప్రిం కోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక ఆరోపణలపై విచారించిన అంతర్గత విచారణ కమిటి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమే చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. సీజేఐని ఇరికించేందుకే ఆరోపణలు చేశారని తెలిపింది.
ఆరోపణల్లో నిజం లేదని చెప్పడం భాధించింది
ఈనేపథ్యంలోనే మాజీ ఉద్యోగనికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపింది. కమిటి ముందు తాను చేసిన ఆరోపణలతోపాటు పలు సాక్ష్యాలు సైతం కమిటి ఉంచానని తెలిపింది. అయినా కమిటి అందులో ఎలాంటీ అధారాలు లేవని చెప్పడాన్ని ఆమేతోపాటు కుటుంభ సభ్యులు సైతం తీవ్ర ఆవేదనకు లోనమయ్యామని గురయ్యామని తెలిపింది.
నన్ను నా కుటుంభసభ్యులపై ప్రతికార దాడులు కొనసాగుతాయి
కాగా గొగోయ్ పై పిర్యాధు చేసిన నేపథ్యంలో మొదటి నుండి కూడ ఆమేపై దాడులు జరుగుతున్నాయని ప్రస్తుత తీర్పు నేపథ్యంలో మరిన్ని ప్రతికార దాడులు జరిగే అవకాశం ఉందని అమే ఆందోళన వ్యక్తం చేసింది .మరోవైపు తీర్పు కాపిని అందించకూడదని కమిటి ఎందుకు నిర్ణయించిందో అర్ధం కావడం లేదని పేర్కోంది. కాగా తన న్యాయవాదిని సంప్రదించిన అనంతరం ఎలాంటీ చర్యలు చేపట్టాలో నిర్ణయిస్తానని ఆమే తెలిపారు..