వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యెడ్యూరప్పకు అమిత్ షా షాక్! సన్నిహితురాలు శోభాకందర్లాజేకు నో టిక్కెట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు అధిష్టానం షాకిచ్చింది. ఆమెకు సన్నిహితురాలైన శోభా కందర్లాజేకు పార్టీ అధిష్టానం టిక్కెట్ నిరాకరించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో శోభ పేరు లేదు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.

మొత్తం 225 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు 219 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. శోభా కందర్లాజే ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె ఉవ్వీళ్లూరుతున్నారు. విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు.

Disappointment for Shobha Karandlaje, BJP gives actor Jaggesh ticket to Yeshvanthpur

గతంలో యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్లో మంత్రిగా పని చేశారు. జగదీష్ శెట్టార్ ప్రభుత్వంలోను మంత్రిగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె పేరుకు ఎక్కడా చోటు కల్పించలేదు. తన మద్దతుదారు అయిన శోభాకు టిక్కెట్ రాకపోవడం యెడ్డీకి షాక్ అంటున్నారు.

ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసిన బీజేపీ సోమవారం నాలుగో జాబితా విడుదల చేసింది. ఇందులోనైనా శోభా కందర్లాజే పేరు ఉంటుందని భావించారు. మరోవైపు యెశ్వంతపూర్ నుంచి ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు జగ్గేష్‌కు టిక్కెట్ ఇచ్చారు.

English summary
In what appears to be a setback for BS Yeddyurappa, the list of seven candidates announced by the BJP central leadership does not include the name of sitting Udupi-Chikkamagalur MP Shobha Karandlaje and his son BY Vijendra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X