జన్ ధన్ ఖాతాల్లో రెండో విడత డబ్బులు.. విత్ డ్రాకి ఈ నిబంధనలు తప్పనిసరి..
లాక్ డౌన్ తర్వాత చాలామంది పేదలు ఉపాధి కోల్పోవడంతో వారిని ఆదుకునే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజనా పథకం కింద రూ.1.70లక్షల కోట్లు రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద మూడు నెలల పాటు మహిళల జన్ ధన్ ఖాతాల్లో ప్రతీ నెలా రూ.500 జమ చేయనున్నారు.
Recommended Video
చెప్పినట్టుగానే ఏప్రిల్ నెలలో జన్ ధన్ ఖాతాల్లో రూ.500 జమ అయ్యాయి. మే నెల కోటాకు సంబంధించి తాజాగా జన్ ధన్ ఖాతాల్లో రూ.500 చొప్పున డబ్బులు జమ చేశారు. అయితే ఖాతాల్లో డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు మహిళలు బ్యాంకులు,ఏటీఎంల వద్దకు క్యూ కడుతుండటంతో కేంద్రం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. బ్యాంకులు,ఏటీఎంల వద్ద రద్దీని తగ్గించేందుకు సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
దీని ప్రకారం.. బ్యాంకు ఖాతా చివరి రెండు నంబర్లు 0,1గా ఉన్నవాళ్లు మే 4వ తేదీన డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి. అలాగే బ్యాంకు ఖాతా చివరి రెండు నంబర్లు 2,3గా ఉన్నవాళ్లు మే 5న విత్ డ్రా చేసుకోవాలి. చివరి రెండు నంబర్లు 6,7గా ఉన్నవాళ్లు మే 8న విత్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖాతా చివరి రెండు నంబర్లు 8,9గా ఉన్నవాళ్లు మే 11వ తేదీన విత్ డ్రా చేసుకోవాలి.
ఒకవేళ మే 11 లోపు ఎవరైనా విత్ డ్రా చేసుకోకపోతే.. ఆ తర్వాత వారి వీలును బట్టి ఎప్పుడైనా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. వారి నగదు వెనక్కి వెళ్లడం వంటిది జరగదు. వంద శాతం ఆ డబ్బు వారి ఖాతాల్లో భద్రంగా ఉంటుంది. బ్యాంకులు,ఏటీఎంల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు అనువుగా కేంద్రం ఈ కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది.