ఎల్ఏసీ కీలక పాయింట్ల వద్ద చైనా బలగాలు, మిగతా చోట్ల దళాల వెనక్కి ప్రక్రియ కొనసాగింపు: జై శంకర్..
తూర్పు లడాఖ్లో గల గాల్వాన్ వ్యాలీ వద్ద భారత జవాన్లపై చైనా సైనికుల దాడితో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నుంచి తమ బలగాలను ఇరుదేశాలు వెనక్కి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ పేర్కొన్నారు. యూకేకు చెందిన మీడియా హౌస్ ఇండియా గ్లోబల్ వీక్ నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్నారు.
Recommended Video
ఎల్ఏసీ వద్ద నుంచి సైనికులను వెనక్కి తీసుకొచ్చేందుకు వారం క్రితం ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయని జై శంకర్ తెలిపారు. కానీ ఇరువర్గాల మధ్య కొన్ని వైరుధ్యాల వల్ల ఎల్ఏసీ వెంట కీలక స్థానాల నుంచి బలగాల తరలింపు ఆలస్యమవుతోందని చెప్పారు. సరిహద్దు వద్ద దళాలను వెనక్కి తీసుకున్నప్పటికీ.. కీలకమైన పాయింట్లు బఫర్ జోన్లుగా పిలిచే పాంగోంగ్ సరస్సు వద్ద మాత్రం చైనా దళాలు ఇప్పటికీ మొహరించి ఉన్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి, తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో వైరస్ మరింత విసృతమయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ తయారు చేసేందుకు భారత్ ఫార్మా కంపెనీలో నిమగ్నమయ్యాయని చెప్పారు. కరోనా వైరస్పై బ్రిటన్తో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. అటు అమెరికాతో ధ్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కోసం పాటుపడతామని చెప్పారు.