సిబ్బందిని కర్రతో చితకబాదిని జిల్లా కలెక్టర్ , ఎందుకంటే, అవి విలువైనవనేనా ?
తన అధికారిక నివాసంలో రెండు చెట్లను నరికివేశారని, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై కలెక్టర్ కర్రతో చితకబాదాడు. వారిని ఉద్యోగం నుండి తొలగించారు. బాదితులు పోలీస్ స్టేషన్ లో కలెక్టర్ పై ఫిర్యాదు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ :ఆయనో జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే తన ఇంట్లో రెండు చెట్లు నరికివేయడాన్ని గుర్తించాడు. దీంతో అక్కడ పనిచేసే సిబ్బందిపై కర్రతో దాడి చేశాడు. కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ భాదితులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు .ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రెయిచ్ జిల్లా కలెక్టర్ గా అభయ్ సింగ్ పనిచేస్తున్నాడు. తన ఇంట్లో ఉన్న రెండు చెట్లు కన్పించకపోయేసరికి అక్కడ పనిచేసే సిబ్బందిని భాద్యులుగా చేశాడు. వారిపై కర్రతీసుకొని విచక్షణరహితంగా కొట్టాడు.
అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని విధుల నుండి తొలగించాడు. కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ బాదితులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. బాదితులు పోలీస్ స్టేషన్ లో కలెక్టర్ పై పిర్యాదు చేశారు. అయితే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.
అభయ్ సింగ్ అధికారిక నివాసం లో రెండు చెట్లను గుర్గు తెలియని వ్యక్తులు నరికేశారు. ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్ అక్కడ విధుల్లో ఉన్న ప్లాటూన్ కమాండర్ హరిశ్చంద్రశర్మ, హోంగార్డులు దర్భరీలాల్, శివకుమార్, మహ్హాద్ కమరుద్దీన్, ధర్మరాజ్ లను చితకబాదారు. బాదితులు ఈ ఘటనతో ఆందోళన చేశారు.